IPL 2022: ఐపీఎల్ ప్రారంభంపై బీసీసీఐ కీలక నిర్ణయం.. తొలి మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ ఎంట్రీపై సందిగ్ధం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్‌లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. దీని కారణంగా గత సీజన్‌లతో పోలిస్తే మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది.

IPL 2022: ఐపీఎల్ ప్రారంభంపై బీసీసీఐ కీలక నిర్ణయం.. తొలి మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ ఎంట్రీపై సందిగ్ధం..
Ipl 2022
Follow us

|

Updated on: Feb 24, 2022 | 9:29 PM

అందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు టోర్నమెంట్ షెడ్యూల్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త అందింది. టోర్నమెంట్ ప్రారంభ తేదీపూ క్లారిటీ వచ్చింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) మార్చి 26 నుంచి కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. పది జట్లతో ఈ భారీ, సుదీర్ఘ టోర్నమెంట్‌ను ముంబై, పూణేలోని 4 స్టేడియాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈసారి అభిమానుల సమక్షంలో టోర్నమెంట్ జరగదని తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అంటే, ఎక్కువ జట్లు, ఎక్కువ మ్యాచ్‌లు ప్రేక్షకుల సందడి లేకుండానే జరగనున్నాయి.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 24 గురువారం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, టోర్నమెంట్ అధికారిక ప్రసార భాగస్వామి డిస్నీ-స్టార్ అభ్యర్థన మేరకు కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్‌ను ఆదివారం, మార్చి 27 నుంచి ప్రారంభించాలని బోర్డు ముందుగా కోరుకుంది. అయితే ఆదివారం డబుల్-హెడర్‌తో టోర్నమెంట్‌ను ప్రారంభించాలని స్టార్ కోరింది.

మహారాష్ట్రలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో ప్రేక్షకుల ప్రవేశంపై సందిగ్ధం నెలకొంది. లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లను మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు బోర్డు అంగీకరించింది. ఈ మ్యాచ్‌లు ముంబైలోని మూడు, పుణెలోని ఒక స్టేడియంలో జరుగుతాయి. మార్చి 26 నుంచి మహారాష్ట్రలోనే టోర్నీ ప్రారంభమవుతుందని, త్వరలోనే టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ నివేదికలో తెలిపారు.

ఈసారి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి స్టేడియంకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని, అయితే ఎంత మంది ప్రేక్షకులు వస్తారనేది మహారాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే నిర్ణయిస్తామని పటేల్ చెప్పారు.

ముంబైలో 55 మ్యాచ్‌లు, పుణెలో 15 మ్యాచ్‌లు.. 10 జట్ల టోర్నీలో ఈసారి మ్యాచ్‌ల సంఖ్య కూడా 74కి పెరగనుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం, వీటిలో 55 మ్యాచ్‌లు, ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్ డివై పాటిల్‌లోని మూడు స్టేడియంలలో జరుగుతాయి. అదే సమయంలో పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఫైనల్‌తో సహా ప్లేఆఫ్‌లోని 4 మ్యాచ్‌లపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

Also Read: IND VS SL: మరోసారి సేమ్ సీన్.. ఆ యంగ్ ప్లేయర్‌ను వేధిస్తోన్న గాయాలు.. తొలి టీ20 ప్లేయింగ్ XI నుంచి కూడా..

Deepak Hooda Debut: టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన దీపక్ హుడా.. క్యాప్ అందించిన రోహిత్..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!