AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రాకెట్ కంటే వేగం.. ఇలా రనౌట్ చేస్తే బ్యాటర్లకు కష్టమే.. వైరల్ వీడియో

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో మాథ్యూ వేడ్ 5 మ్యాచ్‌ల్లో 13.6 సగటుతో కేవలం 68 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు 30గా నిలిచింది.

Watch Video: రాకెట్ కంటే వేగం.. ఇలా రనౌట్ చేస్తే బ్యాటర్లకు కష్టమే.. వైరల్ వీడియో
Ipl 2022 Matthew Wade Run Out
Venkata Chari
|

Updated on: Apr 15, 2022 | 7:36 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 24వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడుతున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ మరోసారి ప్రత్యేకంగా ఏమీ చేయలేక కేవలం ఆరు బంతుల్లోనే 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూ వేడ్(Matthew Wade) వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించి, జిమ్మీ నీషమ్‌ను మొదటి ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో వాడే భారీ ఇన్నింగ్స్ ఆడబోతున్నట్లు అనిపించింది. కానీ, స్టన్నింగ్ రనౌట్‌తో అతని ఇన్నింగ్స్‌ను ముగించింది. దక్షిణాఫ్రికా ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుసెన్ వేసిన స్ట్రెయిట్ త్రోలో వేడ్ రనౌట్ అయ్యాడు.

శుభ్‌మన్ గిల్ రెండో ఓవర్ రెండో బంతిని కవర్ వైపు ఆడుతూ పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. వేడ్ కూడా పరుగు తీసేందుకు పరిగెత్తాడు. అయితే అక్కడే ఉన్న డస్సెన్ డైరెక్ట్ త్రో చేయడంతో నేరుగా వికెట్‌పైకి వెళ్లింది. డైవింగ్ చేసినా వేడ్ క్రీజులో లేకపోవడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

రూ. 2.40 కోట్లకు దక్కించుకున్న గుజరాత్..

IPL 2022లో, మాథ్యూ వేడ్ 5 మ్యాచ్‌లలో 13.6 సగటుతో 68 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో, అతను లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై చేసిన 30 పరుగులు అతని అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మాథ్యూ వాడ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో భారీ ప్రైస్ రావడంతో మాథ్యూ వేడ్ కౌంటీ క్రికెట్ నుంచి వైదొలిగాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే అభినవ్ మనోహర్ 43, డేవిడ్ మిల్లర్ అజేయంగా 31 పరుగులు చేశారు. రాజస్థాన్ తరఫున యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్ ఒక్కో వికెట్‌ను దక్కించుకున్నారు.

Also Read: Rohit Sharma IPL 2022: రోహిత్ శర్మపై వేటు పడనుందా.. తర్వాతి మ్యాచ్‌లో అలా చేస్తే నిషేధమే?

IPL 2022: మెరిసిన హార్దిక్ పాండ్యా.. 37 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్‌ గెలుపు..