IPL 2021: కోహ్లీసేనకు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు ఆటగాళ్లు టోర్నీకు దూరం…

| Edited By: Team Veegam

Apr 27, 2021 | 7:22 PM

IPL 2021 RCB : ఐపీఎల్ 14వ సీజన్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాకుల..

IPL 2021: కోహ్లీసేనకు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు ఆటగాళ్లు టోర్నీకు దూరం...
Virat Kohli 1
Follow us on

ఐపీఎల్ 14వ సీజన్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో.. ఆ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఇక బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ఈ  తప్పిదం మూడుసార్లు కొనసాగితే.. ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కునే అవకాశం ఉంది.

అటు బెంగళూరు ఆటగాళ్లు రిచర్డ్ సన్, జాంపా కూడా వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ ప్రకటన చేశారు. దీనితో బెంగళూరుకు దెబ్బ మీద దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇదిలా ఉంటే నిన్న ఆర్సీబీ.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనితో బెంగళూరు ఈ సీజన్ లో మొదటి ఓటమిని చవి చూసింది.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!