IPL 2021: ఆ ప్లేయర్ రాజస్థాన్ బ్రహ్మస్త్రం.. కోహ్లీసేనపై రివెంజ్ కు సిద్ధం.!

|

Apr 22, 2021 | 3:44 PM

ఈ మాజీ ఆర్సీబీ ప్లేయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో సత్తా చాటాలనుకుంటున్నాడు....

IPL 2021: ఆ ప్లేయర్ రాజస్థాన్ బ్రహ్మస్త్రం.. కోహ్లీసేనపై రివెంజ్ కు సిద్ధం.!
Rr
Follow us on

ఈ మాజీ ఆర్సీబీ ప్లేయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో సత్తా చాటాలనుకుంటున్నాడు. ఇక అతడినే అస్త్రంగా ఉపయోగించాలని చూస్తోంది రాజస్థాన్ టీమ్. ఇంతకీ అతను ఎవరో కాదు శివమ్ దూబే.

గతేడాది సీజన్లో శివమ్ దూబే ఆర్.సీ.బీ జట్టులో ఒక భాగం. కానీ పేలవ ప్రదర్శన కారణంగా అతడ్ని జట్టు నుంచి తొలగించారు. ఇక మినీ ఆక్షన్ లో రాజస్థాన్ జట్టు శివమ్ దూబేను దక్కించుకుంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుత ఆటతీరును ప్రదర్శించి సత్తా చాటాలని శివమ్ దూబే ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ తరపున శివమ్ మంచి ప్రదర్శన కనబరిచాడు.

వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు..

గత సీజన్‌లో శివమ్ దూబే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 11 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 18.42 సగటుతో 129 పరుగులు, 122.85 స్ట్రైక్ రేట్ సాధించాడు. ముంబై తరపున దేశీయ క్రికెట్ లో మెరిసిన దూబే.. ముంబై దేశీయ టి 20 లీగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు.

Read also:

Scary Video: ఆకలి మీదున్న సింహాలు.. మాటు వేసిన మొసళ్లు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు.!

Viral: ఒకేసారి 16 మంది అబ్బాయిలతో డేటింగ్.. అమ్మాయి రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!