IND vs SL: రోహిత్ సేన విజయానికి అడ్డంకిగా మారిన వర్షం.. వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

ధర్మశాలలో టీమిండియా చూపు సిరీస్ కైవసం చేసుకోవడంపైనే ఉంది. అయితే వర్షం కురవకుండా మ్యాచ్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

IND vs SL: రోహిత్ సేన విజయానికి అడ్డంకిగా మారిన వర్షం.. వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
India Vs Sri Lanka

Updated on: Feb 26, 2022 | 2:54 PM

భారత్‌- శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌(India vs Sri Lanka)లో మిగిలిన రెండు మ్యాచ్‌లు ధర్మశాల (Dharamshala)లో జరగనున్నాయి . నేడు రెండో టీ20 జరగనుంది. కానీ, ఈ మ్యాచుకు వర్షం అడ్డుపడే ఛాన్స్ ఉంది. అక్కడి వాతావరణం (Weather Report)మరోసారి అభిమానులకు నిరాశను కలిగించేలా ఉంది. వాతావరణ నివేదిక ప్రకారం, మ్యాచ్ సమయంలో వర్షం ఆటకు ఆటంకం కలిగించనుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. లక్నోలో జరిగిన తొలి టీ20లో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మశాలలో టీమిండియా చూపు సిరీస్‌ను కైవసం చేసుకోవడంపైనే ఉంటుంది. అయితే వర్షం కురవకపోవడం, మ్యాచ్ జరిగితేనే ఇది సాధ్యమవుతుంది.

అయితే, మొదటిసారి ధర్మశాలలో ప్రతికూల వాతావరణం లేదా వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా అక్కడ వర్షం కారణంగా భారత్‌కు చెందిన చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక, ఇప్పుడు భారత్-శ్రీలంక రెండో టీ20లోనూ అదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ కూడా వర్షంతో కొట్టుకుపోతే, ధర్మశాలలో ఇది వరుసగా మూడో మ్యాచ్ అవుతుంది, ఇది రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.

గత రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి..
అంతకుముందు, సెప్టెంబర్ 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్, 2020 మార్చిలో ప్రోటీస్ జట్టుతో జరిగిన ODI మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది.

ధర్మశాలలో భారతదేశ గణాంకాలు..
అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేందుకు భారత జట్టు 7వ సారి ఈరోజు ధర్మశాలలో అడుగుపెట్టనుంది. ఇంతకు ముందు ఆడిన 6 మ్యాచ్‌ల్లో భారత గణాంకాలు ప్రత్యేకంగా ఏమీలేవు. ఇక్కడ ఆడిన 6 మ్యాచుల్లో 3 గెలిచి, 3 మ్యాచుల్లో ఓడిపోయింది. అదే సమయంలో టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ధర్మశాలలో భారత్ ఇంతకు ముందు ఒకే ఒక్క టీ20 ఆడింది. 2015లో జరిగిన టీ20లో భారత జట్టును దక్షిణాఫ్రికా ఓడించింది.

ఈరోజు ధర్మశాలలో శ్రీలంకతో భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు 2017లో రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగ్గా, అందులో శ్రీలంక గెలిచింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారత్‌ను 112 పరుగులకే కట్టడి చేసింది.

Also Read: Wriddhiman Saha: సాహాకు జర్నలిస్ట్ బెదిరింపుల వ్యవహారం.. BCCI కీలక నిర్ణయం..

IPL 2022: ఐపీఎల్‌లో సరికొత్త ఫార్మాట్.. 2 గ్రూప్‌లు, 14 మ్యాచ్‌లు.. 5 జట్లతో రెండేసి.. నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్..

Loading...
Unable to load recommendations.
Follow Us