India vs Pakistan, T20 world Cup 2024 Highlights: టీ-20 ప్రపంచకప్లో 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్థాన్ను భారత్ అనుమతించలేదు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ల బౌలింగ్తో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది.
టీ-20 ఇంటర్నేషనల్లో భారత్ డిఫెండ్ చేసిన అతి తక్కువ స్కోరు ఇదే కావడం గమనార్హం. పాక్ జట్టు 7 వికెట్లకు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి 2 ఓవర్లలో పాకిస్థాన్ విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రా 19వ ఓవర్లో వచ్చి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్కు భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అతను తప్ప మరే బ్యాట్స్మెన్ కూడా 20 మార్కును దాటలేకపోయాడు. జట్టు మొత్తం 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.
టీ20 ప్రపంచకప్లో భారత్ -పాకిస్థాన్లు ఇప్పటి వరకు 7 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 5 సార్లు విజయం సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.
చివరి ఓవర్ వరకు సాగిన భారత్, పాక్ పోరులో చివరకు రోహిత్ సేనదే విజయం. దీంతో ఆడిన 2 మ్యాచ్ల్లో 2 గెలిచి టేబుట్ టాపర్గా నిలిచింది. మొత్తంగా ఐసీసీ ప్రపంచకప్ రికార్డులో టీమిండియా 16 మ్యాచ్లు ఆడితే 15 మ్యాచ్ల్లో పాక్పై విజయా సాధించి, తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది.
పాక్ విజయానికి చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉంది. 19వ ఓవర్ వేసిన బుమ్రా 3 పరుగులే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు.
పాకిస్తాన్ ఛేజింగ్లో ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం 16.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. పాక్ విజయానికి మరో 32 పరుగులు కావాల్సి ఉంది.
పాకిస్తాన్ 10.1 ఓవర్లో 2వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ 1 వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. రిజ్వాన్ 17, ఉస్మాన్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.
బుమ్రా బౌలింగ్లో దూకుడు మీదున్న బాబర్ (13)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో పాక్ 4.4 ఓవర్లలో 26 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.
టీమిండియా బ్యాటర్లలో పంత్ (42) మినహా ఎవ్వరూ రాణించలేకపోవడంతో.. 119 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ ముందు 120 పరుగుల టార్గెట్ నిలిచింది.
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. అమీర్ తన 3వ ఓవర్లో రెండు వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు.
పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయిన భారత్కు మరో దెబ్బ తగిలింది. పంత్ (42) పెవిలియన్ చేరాడు.
పేలవ ఫాంతో దూబే(3) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 5వ వికెట్గా వెనుదిరిగాడు.
పేలవ ఫాంతో ఇబ్బంది పడుతున్న సూర్య (7) మరోసారి నిరాశ పరిచాడు. దీంతో భారత్ 89 పరుగుల వద్దు 4 వ వికెట్ కోల్పోయింది.
10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 81 పరుగులు చేసింది. పంత్ 34, సూర్య 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిన భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకపోతోంది. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత పంత్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ను పునర్మించే క్రమంలో బాగానే ఆడారు. అయితే, 29 పరుగుల భాగస్వామ్యం తర్వాత అక్షర్ పటేల్ (20) బౌల్డ్ అయ్యాడు.
5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. క్రీజులో పంత్, అక్షర్ పటేల్ ఉన్నారు.
టీమిండియా 2వ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (13) పరుగులు చేసిన తర్వాత షాహీన్ బౌలింగ్లో భారీ షాట్ కోసం ట్రై చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది.
వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది. ఈ క్రమంలో కోహ్లీ ఓ బౌండరీ కొట్టి దూకుడు మీదున్నట్లు అనిపించింది. కానీ, ఆ తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు.
ఒక్క ఓవర్ ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ మ్యాచ్ ఆగిపోయింది.
తొలి ఓవర్ వేసిన షాహీన్ షాను రోహిత్ శర్మ చిత్తుగా బాదేశాడు. తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ 8 పరుగులు చేసింది.
ఎట్టకేలకు గ్రేట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగారు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా నేడు పాక్తో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు టీమిండియా దిగ్గజాలు సచిన్, యువరాజ్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ద్రవిడ్తో సంభాషించారు. టీమిండియా ఆటగాళ్లతోనూ మాట్లాడారు.
టాస్ పడినా.. బ్యాడ్ వెదర్తో మ్యాచ్ ఆలస్యం కానుంది. 8.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు.
టాస్కు ముందు న్యూయార్క్లో వర్షం కురిసింది. ఈ మైదానంలో ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరగగా, ఛేజింగ్ జట్టు 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. దీంతో అభిమానులకు కొత్త టెన్షన్ మొదలైంది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.
పాక్ కెప్టెన్ బాబర్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
కీలక మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో టాస్ ఆలస్యం కానుంది.
Der se suru hoga IND vs PAK match.#INDvsPAK #T20WorldCup pic.twitter.com/UJgnou05QV
— Avinash Kr Atish (@Avinashkmratish) June 9, 2024
ప్రస్తుతం పిచ్పై కవర్లు వేసి రోలింగ్ చేస్తున్నారు. భారత్, పాకిస్థాన్ జట్లు నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరుకున్నాయి.
India batting 1st on this pitch will be absolute cinema 🎥 #INDvsPAK #PAKvsIND pic.twitter.com/JRozEMvRj9
— D. (@frustatedDil) June 9, 2024
టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే న్యూయార్క్లోని నాసావులో చినుకులు కురుస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ పేర్కొంది.
మరికొద్దిసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య రణరంగం ప్రారంభం కానుంది.