Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!

Ravi Bishnoi Expensive Over: గెలిచే మ్యాచ్‌లో బౌలర్లు క్రమశిక్షణ తప్పితే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను ఒకే ఒక్క ఓవర్లో చేజార్చుకోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, బౌలింగ్ లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌లో టీమిండియా ఎలా పుంజుకుంటుందో చూడాలి.

Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!
Ind Vs Eng Ravi Bishnoi Bowling Video

Updated on: Jul 05, 2026 | 6:58 AM

England vs India, 2nd T20I Turning Point: గెలుపు ముంగిట నిలిచిన భారత జట్టుకు ఆ ఒక్క ఓవర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో, స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరకు భారత్‌కు పరాజయం తప్పలేదు.

చేతులెత్తేసిన బౌలింగ్.. ఇంగ్లాండ్ ఖాతాలో విజయం..

మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టును భారత్ గట్టిగానే నిరోధించినప్పటికీ, ఆతిథ్య జట్టు కేవలం 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టులో జాకబ్ బెథెల్ 76 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: తొలి మ్యాచ్‌లోనే సచిన్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టిన వైభవ్.. అదేంటో తెలుసా?

మ్యాచ్‌ను మలుపు తిప్పిన 17వ ఓవర్..

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో జాకబ్ బెథెల్ 42 పరుగులతో, సామ్ కర్రన్ అతనికి తోడుగా ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి చివరి 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే భారత్ వైపే మ్యాచ్ మొగ్గు చూపిస్తోంది. ఈ దశలో కెప్టెన్ బంతిని లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి అందించాడు. అయితే ఆ 17వ ఓవర్ భారత అభిమానులకు ఒక పీడకలగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. బిష్ణోయ్ వేసిన తొలి బంతే నో బాల్‌గా మారింది. అతని వెనుక కాలు గీతను తాకడంతో అంపైర్ నో బాల్ ప్రకటించాడు. దీనిని ఆసరాగా చేసుకుని జాకబ్ బెథెల్ ఫ్రీ హిట్ బంతిని ఏకంగా సిక్సర్‌గా మలిచాడు.

ఆ తర్వాతి బంతిని బిష్ణోయ్ డాట్ బాల్ వేసినప్పటికీ, దురదృష్టవశాత్తూ అది కూడా వెనుక కాలు నో బాల్‌గా తేలింది. లభించిన రెండో ఫ్రీ హిట్‌ను కూడా బెథెల్ సిక్సర్‌గా మార్చాడు. ఆ తర్వాత మిగిలిన నాలుగు బంతుల్లో ఒక ఫోర్, మరో సిక్సర్ బాదిన బెథెల్ ఆ ఓవర్లో పరుగుల వరద పారించాడు. ఆ ఒక్క ఓవర్లోనే ఇంగ్లాండ్ బ్యాటర్ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి 18 బంతుల్లో ఇంగ్లాండ్‌కు కేవలం 20 పరుగులు మాత్రమే అవసరమవడంతో వారి విజయం నల్లేరుపై నడకలా మారింది.

ఇది కూడా చదవండి: వైభవ్ కాదు.. టీమిండియాలో ఆ మెంటలోడ్ని ఆపకుంటే మేమంతా అస్సాంకే..

ఫలితం మార్చిన రవి బిష్ణోయ్..

ఈ ఘోర ప్రదర్శనతో రవి బిష్ణోయ్ భారత అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన అత్యంత ఖరీదైన స్పిన్నర్‌గా నిలిచాడు. అంతకుముందు 2012లో న్యూజిలాండ్‌పై సురేష్ రైనా ఒక ఓవర్లో 26 పరుగులు ఇవ్వగా, ఇప్పుడు బిష్ణోయ్ ఆ రికార్డును దాటేశాడు. భారత్ తరపున ఓవరాల్‌గా ఇది మూడో అత్యంత ఖరీదైన ఓవర్. 2020లో శివమ్ దూబే (34 పరుగులు), 2016లో స్టువర్ట్ బిన్నీ (32 పరుగులు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us