
IND vs ENG semifinal cancelled rule: మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనుండగా, రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ పోటీ పడనున్నాయి. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఫిబ్రవరి 5న ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే ఏమవుతుంది? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
గ్రూప్ దశ, సూపర్-8 దశల్లో మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చేవారు. కానీ సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్ కావడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
ఐసీసీ ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే కేటాయించింది. మ్యాచ్ డేలో వర్షం కారణంగా పూర్తి కాలేకపోతే, రిజర్వ్ డేలో మిగిలిన ఆటను పూర్తి చేస్తారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం, నాకౌట్ దశలో (సెమీఫైనల్ లేదా ఫైనల్) మ్యాచ్ ఫలితం రాకపోతే, సూపర్-8 దశలో మెరుగైన స్థానం సాధించిన జట్టే ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
సూపర్-8లో గ్రూప్-2లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-1 నుంచి భారత్ రెండో స్థానంలో సెమీఫైనల్కు చేరింది.
అందువల్ల భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ పూర్తిగా రద్దయితే, ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుతుంది. భారత్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
మార్చి 4న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కూ రిజర్వ్ డే ఉంది.
అయితే అది కూడా ఫలితం లేకుండా ముగిస్తే, సూపర్-8లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకే ఫైనల్ టికెట్ లభిస్తుంది. న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది.
మొత్తానికి, సెమీఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉన్నప్పటికీ, చివరికి సూపర్-8 ర్యాంకింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాతావరణ పరిస్థితులు కూడా జట్ల భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..