IND vs WI: అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు.. బయో బబుల్‌లోకి వెళ్లిన ఆటగాళ్లు..

వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు బయో-బబుల్‌లో చేరడానికి భారత క్రికెట్ జట్టు సభ్యులు సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నారు...

IND vs WI:  అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు..  బయో బబుల్‌లోకి వెళ్లిన ఆటగాళ్లు..
India

Updated on: Jan 31, 2022 | 7:34 PM

వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు బయో-బబుల్‌లో చేరడానికి భారత క్రికెట్ జట్టు సభ్యులు సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆటగాళ్లందరూ సోమవారం బయో బబుల్‌లోకి ప్రవేశించారు. వారు మూడు రోజుల బయో బబుల్‌లో ఉంటారని బీసీసీఐ(BCCI) అధికారి పీటీఐకీ తెలిపారు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(chahal) శనివారం అహ్మదాబాద్‌కు బయలుదేరిన ఫోటోను పోస్ట్ చేశాడు. అతను శిఖర్ ధావన్‌(Shikar dhawan)తో కలిసి విమానంలో కూర్చున్న ఫొటో కూడా పోస్ట్ చేశాడు. వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఈ సిరీస్ మొదటిది. గాయం కారణంగా అతను దక్షిణాఫ్రికాకు వెళ్లలేకపోయాడు. వన్డే, టీ20 రెండు జట్లలోనూ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సభ్యుడు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిబ్రవరి 6 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2వ వన్డేకు మాత్రమే అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది.

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి రెండు సిరీస్‌లకు దూరంగా ఉన్నారు. లెఫ్టార్మ్ మణికట్టు-స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ODI జట్టులోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా ODIలకు దూరమైన వాషింగ్టన్ సుందర్, స్వదేశీ సిరీస్‌ల్లో పాల్గొననున్నాడు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో జరిగిన 3-మ్యాచ్‌లలో అధ్వాన్నమైన ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్ వన్డే జట్టు నుంచి తప్పించారు.. సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ గాయం కారణంగా వెస్టిండీస్ సిరీస్‌కు అందుబాటులో లేడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయ్ వన్డేలు, టీ20 జట్లలో చోటు సంపాదించాడు.

Read Also… Virat Kohli: అప్పుడు కూడా కెప్టెన్‌లా ఆలోచించా.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Loading...
Unable to load recommendations.
Follow Us