IND ODI Squad Announcement Live: రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా?

India vs West Indies ODI Squad Announcement Live Updates: వెస్టిండీస్‌తో జరగబోయే వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టును నేడు ప్రకటించే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 6న ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీ20ఐ జట్టు, రాబోయే ఆసియా క్రీడల కోసం ప్రకటించిన జట్టును పోలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఒకేసారి రెండు సిరీస్ లు ఆడనుండడంతో అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి వన్డే జట్టును ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి మరింత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు.

IND ODI Squad Announcement Live: రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా?
India Vw West Indies Odi Squad Announcement Live Updates

Updated on: Sep 16, 2026 | 5:08 PM

India vs West Indies ODI Squad Announcement Live Updates: వెస్టిండీస్‌తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును నేడు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీసీఐ ఉన్నతాధికారుల ఎంపిక సమావేశం జరుగుతోంది. ఓ నివేదిక ప్రకారం, ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందం ఈ నెల చివరలో ముగిసిపోనుంది. ఇదే అగార్కర్ కు చివరి ఎంపిక సమావేశం కావొచ్చు. వెస్టిండీస్ సిరీస్ కోసం జరిపే ఈ ఎంపిక సమావేశమే తనకు చివరిది కావొచ్చని అగార్కర్ తనకు సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు ఆ నివేదికలో పేర్కొంది. అగార్కర్ ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించుకుంటారని ముందుగా భావించినా, అయితే, రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల తలెత్తిన వివాదాలు, బీసీసీఐ ఉన్నతాధికారుల మధ్య సంబంధాలు చెడినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఇదే ఫైనల్ సెలక్షన్ కావొచ్చని చెబుతున్నారు.

  1. వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్..:
    వన్డే, టీ20ఐ సిరీస్‌ల షెడ్యూల్ ఈ విధంగా ఉంది:

    వన్డే సిరీస్: మొదటి వన్డే: ఆదివారం, 27 సెప్టెంబర్ 2026 – గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం, తిరువనంతపురం (మధ్యాహ్నం 2:00 గంటలకు)

    2వ వన్డే: బుధవారం, 30 సెప్టెంబర్ 2026 – డా. భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియం, గౌహతి (మధ్యాహ్నం 2:00 గంటలకు IST)

    3వ వన్డే: శనివారం, 3 అక్టోబర్ 2026 – మహారాజా యాద్వింద్ర సింగ్ PCA స్టేడియం, న్యూ చండీగఢ్ (మధ్యాహ్నం 2:00 గంటలకు IST)

    టి20ఐ సిరీస్:

    మొదటి టీ20: మంగళవారం, 6 అక్టోబర్ 2026 – అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియం, లక్నో (సాయంత్రం 7:00 గంటలకు IST)

    2వ టీ20ఐ: శుక్రవారం, 9 అక్టోబర్ 2026 – జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ (సాయంత్రం 7:00 గంటలకు భారత కాలమానం ప్రకారం)

    3వ టీ20ఐ: ఆదివారం, 11 అక్టోబర్ 2026 – హోల్కర్ స్టేడియం, ఇండోర్ (సాయంత్రం 7:00 గంటలకు IST)

    4వ టీ20: బుధవారం, 14 అక్టోబర్ 2026 – రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్ (సాయంత్రం 7:00 గంటలకు IST)

    5వ T20I: శుక్రవారం, 16 అక్టోబర్ 2026 – M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు (7:00 PM IST)

  2. ప్రస్తుత బీసీసీఐ సెలెక్టర్లు ఎవరు?: బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..
    1. చైర్‌పర్సన్ (వెస్ట్ జోన్): అజిత్ అగార్కర్
    2. సెంట్రల్ జోన్: ఆర్పీ సింగ్
    3. సౌత్ జోన్: ప్రజ్ఞాన్ ఓజా
    4. నార్త్ జోన్: అజయ్ రాత్ర
    5. ఈస్ట్ జోన్: శివ సుందర్ దాస్
  3. షమీకి ఛాన్స్ ఉందా?: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దుబాయ్‌లో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆసియా క్రీడల కారణంగా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేనప్పటికీ, అతని చేరిక కోసం ఎంతో ఒత్తిడి ఉంటే తప్ప, జట్టులో స్థానం కోల్పోయిన ఈ పేసర్‌కు అవకాశం లభించే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి.
  4. అగార్కర్ గుడ్ బై..?: ఒక నివేదిక ప్రకారం, ఈ నెల చివరలో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందం ముగియనున్నందున, ఇది ఆయనకు చివరి ఎంపిక సమావేశం కావొచ్చు. వెస్టిండీస్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన తర్వాత, తనకు మూడేళ్లపాటు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియాకు కృతజ్ఞతలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ వరకు కాంట్రాక్టు పొడిగింపు కోరినట్లు అగర్కర్ వార్తలు వచ్చినప్పటికీ, అది జరిగేలా కనిపించడం లేదు.
  5. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్య..: సెలక్షన్ సమావేశంలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ కీలక చర్చనీయాంశాల్లో ఒకటిగా ఉండనుంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ తర్వాత ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల 50 ఓవర్ల సిరీస్ కోసం అతడిని ఇండియా ‘ఎ’ జట్టులో చేర్చారు. అయితే, అతని ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
  6. పేస్ బౌలింగ్ విభాగానికి సిరాజ్ సారథ్యం?: జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ బౌలింగ్ విభాగానికి మహమ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. అతను ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే జట్టులో భాగం కానప్పటికీ, గత సిరీస్‌లో ఆడిన గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు తిరిగి జట్టులోకి రానున్నాడు.
  7. రోహిత్ జట్టులో ఉంటాడా లేదా?: సెలక్షన్ గడువు సమీపిస్తున్న కొద్దీ రోహిత్ శర్మ భవిష్యత్తు కీలక చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లో జరిగిన భారత చివరి వన్డే సిరీస్ సందర్భంగా, జట్టు తరపున రోహిత్‌కు అదే చివరిది కావొచ్చని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, సెలెక్టర్ల ప్రణాళికలలో ఉన్నంత కాలం రోహిత్ ఆడుతూనే ఉంటాడని చెబుతూ, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఆ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే.
  8. రిషబ్ పంత్ రీఎంట్రీ..?: పీటీఐ నివేదిక ప్రకారం, వెస్టిండీస్ సిరీస్‌తో రిషబ్ పంత్ భారత వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో పంత్ పేలవ ప్రదర్శన కారణంగా టెస్ట్ వైస్ కెప్టెన్సీతో పాటు వైట్-బాల్ జట్లలో కూడా స్థానం కోల్పోయాడు. అయితే, ఇషాన్ కిషన్ జపాన్‌లో ఉండటంతో, కేఎల్ రాహుల్ వన్డే కీపర్‌గా ఎంపిక కావడంతో 15 మంది సభ్యుల జట్టులో పంత్ కు చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ లేని సమయంలో రాహుల్ శుభ్‌మన్ గిల్‌కు డిప్యూటీగా కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంత్‌కు అవకాశం దక్కకపోతే, సెలెక్టర్లు ధ్రువ్ జూరెల్‌ను ఎంచుకుని, ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించడానికి పంత్‌ను పంపుతారు,” అని ఆ నివేదిక పేర్కొంది.
  9. పాటీదార్ రీఎంట్రీ..?: పార్ల్‌లో దక్షిణాఫ్రికాతో తన ఏకైక వన్డే ఆడిన మూడేళ్ల తర్వాత, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బ్యాకప్ నెం. 4 స్థానం కోసం పోటీలో ఉండవచ్చు. ఆసియా క్రీడల్లో భారత్‌కు నాయకత్వం వహించనున్న శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో, ఈ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్ భర్తీ చేసే అవకాశం ఉంది.
Loading...
Unable to load recommendations.
Follow Us