AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan: భారత్‌పై పాకిస్తాన్ జట్టు బ్లాక్ బ్యాండ్‌తో ఆడుతోంది.. ఎందుకో తెలుసా..!

Asia Cup 2022, India vs Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆదివారం ఆసియా కప్-2022 మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు దాని ఆటగాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

India vs Pakistan: భారత్‌పై పాకిస్తాన్ జట్టు బ్లాక్ బ్యాండ్‌తో ఆడుతోంది.. ఎందుకో తెలుసా..!
Pakistan Cricket Team
Sanjay Kasula
|

Updated on: Aug 28, 2022 | 5:37 PM

Share

ఆసియా కప్-2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ గురించే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ జట్టు ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్ ధరించి మైదానంలోకి దిగనున్నారు. ఆటగాళ్లు తరచుగా ఇలాంటి నల్ల బ్యాండ్‌తో ఆడుతుంటారు. ఈసారి కూడా అలాగే ఆడేందుకు రెడీ అవుతున్నారు. తమ దేశంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ పాకిస్తానీ జర్నలిస్ట్‌ ట్వీట్‌ చేశారు. ఈ సమయంలో పాకిస్తాన్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఈ విధ్వంసంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఇళ్లు కోల్పోయారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్, బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్స్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో బలూచిస్థాన్‌కు కనెక్టివిటీ తెగిపోయింది.

వరద బీభత్సంతో..

పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఈ వరదల్లో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం బలూచిస్తాన్‌కు చెందిన నలుగురు, గిల్కిత్ బాల్టిస్తాన్‌కు చెందిన ఆరుగురు, ఖైబర్ పఖ్‌టూన్‌కు చెందిన 31 మంది, సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 76 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 110 జిల్లాలు ఈ వరదల బారిన పడ్డాయి. 72 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. ఈ వరదల కారణంగా పాకిస్తాన్‌లో 33 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. జియో న్యూస్ అందించిన సమాచారం ప్రకారం, 950,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటిలో 650,000 ఇళ్లు సగం శిథిలమయ్యాయి.

పాకిస్తాన్‌కు హై టెన్షన్..

ఈ మ్యాచ్‌ భారత్‌- పాకిస్థాన్‌లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఇది మాత్రమే కాదు, మహ్మద్ వసీం జూనియర్ కూడా వెన్ను గాయం కారణంగా తప్పుకున్నాడు. ఈ టోర్నీకి హసన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. ఇంతకుముందు హసన్‌కు జట్టులో చోటు దక్కలేదు. అయితే షాహీన్ గాయం తర్వాత అతన్ని పిలిచారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం

ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..