IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌.. రాజ్‌కోట్‌ స్టేడియంపేరు మార్పు.. ఎవరి పేరు పెట్టనున్నారంటే?

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. అయితే అంతకు ముందే స్టేడియం పేరు మారనుంది. రాజ్‌కోట్‌లోని కొత్త స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ప్రస్తుతం రాజ్‌కోట్‌లోని స్టేడియానికి ఎలాంటి పేరు లేదు.

IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌.. రాజ్‌కోట్‌ స్టేడియంపేరు మార్పు.. ఎవరి పేరు పెట్టనున్నారంటే?
India Vs England

Updated on: Feb 06, 2024 | 3:38 PM

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. అయితే అంతకు ముందే స్టేడియం పేరు మారనుంది. రాజ్‌కోట్‌లోని కొత్త స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ప్రస్తుతం రాజ్‌కోట్‌లోని స్టేడియానికి ఎలాంటి పేరు లేదు. ఇది దాని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అంటే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా మాత్రమే పిలుస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు లెజెండరీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ నిరంజన్ షా పేరు పెట్టనున్నారు. భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు ప్రారంభానికి ఒకరోజు ముందు క్రికెట్ స్టేడియానికి నిరంజన్ షా పేరు పెట్టనున్నారు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ కాకముందు, నిరంజన్ షా స్వయంగా క్రికెటర్. ఆయన 1965- 1975 మధ్య సౌరాష్ట్ర తరపున ఫస్ట్-క్లాస్ తరఫున క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం నిరంజన్ షా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు.

రాజ్‌కోట్‌లోని స్టేడియంలో భారత జట్టు టెస్ట్ రికార్డును పరిశీలిస్తే, భారత్ ఇక్కడ 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 1 గెలిచింది, మరొకటి డ్రా అయింది. 2016లో ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన టెస్టు డ్రా అయింది. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన చివరి టెస్టులో ఆడి విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మూడో టెస్టు రాజ్‌కోట్‌లో జరగనుంది. నాలుగో టెస్టు రాంచీలో జరగనుండగా, 5వ, చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది.

ఇవి కూడా చదవండి

కీలకం కానున్న మూడో టెస్ట్

భారత జట్టుకు జైషా అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us