IND vs ENG: ఆ డేంజరస్ ప్లేయర్‌తో మరోసారి బరిలోకి.. రాజ్‌కోట్‌లో ఆమీతుమీ తేల్చుకోనున్న ఇంగ్లండ్

England Playing 11 For 3rd T20I vs India: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0తో వెనుకబడి ఉంది. ఇక భారత్‌తో జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో మార్పులు చేయలేదు. చెన్నైలోని రెండో మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన బ్రైడన్ కార్సే, జామీ స్మిత్‌లను మూడో మ్యాచ్‌లో కూడా ఆడించనుంది. జోఫ్రా ఆర్చర్‌కు మరో ఛాన్స్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకమైనది.

IND vs ENG: ఆ డేంజరస్ ప్లేయర్‌తో మరోసారి బరిలోకి.. రాజ్‌కోట్‌లో ఆమీతుమీ తేల్చుకోనున్న ఇంగ్లండ్
IND vs ENG
Follow us
Venkata Chari

|

Updated on: Jan 27, 2025 | 6:00 PM

England Playing 11 For 3rd T20I vs India: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో 2-0తో వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ రాజ్‌కోట్‌లో జరగనున్న మూడో టీ20కి తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. చెన్నైలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. అయితే, రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇంగ్లండ్ చెన్నైలో ఫీల్డింగ్ చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌తో మూడో మ్యాచ్ ఆడనుంది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది. అయినప్పటికీ ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

రెండో టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం జామీ స్మిత్‌కు ఇంగ్లండ్ ఇచ్చింది. అతను దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. స్కోరు 90/5గా ఉన్నప్పుడు, స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చి టీమిండియా అత్యంత ప్రమాదకరమైన బౌలర్ వరుణ్ చక్రవర్తిని లక్ష్యంగా చేసుకున్నాడు. చక్రవర్తితో సహా ఇతర భారత స్పిన్నర్లను స్మిత్ చాలా బాగా ఆడాడు. కొన్ని భారీ షాట్లు కొట్టాడు. అయితే, మితిమీరిన దూకుడు కారణంగా వికెట్ కోల్పోయాడు. ఔట్ కావడానికి ముందు, స్మిత్ 12 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 22 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తరపున బ్రైడన్ కార్సే అద్భుత ప్రదర్శన చేశాడు. కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌కు కార్స్ కేవలం 17 బంతుల్లోనే 31 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ కారణంగానే ఇంగ్లండ్ 165 పరుగుల స్కోరును చేరుకుంది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అద్భుతం చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ తరపున అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అతని ఆల్ రౌండ్ ప్రదర్శన దాదాపు ఇంగ్లండ్ మ్యాచ్‌ని గెలిపించేలా చేసింది. జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో 60 పరుగులు ఇచ్చినప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకాన్ని నిలబెట్టుకుంది. మూడో టీ20 ఇంగ్లండ్‌కు డూ ఆర్ డై అవుతుంది. మరో ఓటమితో సిరీస్‌ను వారి చేతుల్లోంచి భారత జట్టు చేజిక్కించుకుంటుంది.

మూడో టీ20కి ఇంగ్లండ్ ప్లేయింగ్ 11: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జేమీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..