AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd Test: రెండో టెస్టుకు ముందు రోహిత్ సేనకు గుడ్‌న్యూస్.. ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..

India vs England Second Test: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లిష్ జట్టుకు భారీ షాక్ తగిలింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ విశాఖపట్నం టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అంటే రెండో టెస్టు ఆడలేడు. ఇది భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

IND vs ENG 2nd Test: రెండో టెస్టుకు ముందు రోహిత్ సేనకు గుడ్‌న్యూస్.. ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
Ind Vs Eng 2nd Test
Venkata Chari
|

Updated on: Feb 01, 2024 | 8:33 AM

Share

Jack Leach ruled out: : భారత్‌తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు (India vs England) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ విశాఖపట్నం టెస్టుకు దూరమైనట్లు సమాచారం. హైదరాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జాక్ లీచ్ గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టులో ఆడడని అంటున్నారు.

భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్ టెస్టు జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్ జాక్ లీచ్ ఎడమ మోకాలికి గాయం కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. విశాఖలో మిగతా జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయకపోవడంతో రెండో టెస్టుకు దూరమవుతాడని అంటున్నారు. ఒకవేళ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైతే.. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు.

ఎందుకంటే, విశాఖపట్నం టెస్టులో నలుగురు స్పిన్నర్లను బరిలోకి దించాలని ఇంగ్లాండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ సూచించాడు. అయితే, జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైతే.. నలుగురు స్పిన్నర్లతో వెళ్లాలన్న ఇంగ్లీష్ కోచ్ ప్లాన్ రివర్స్ అవుతుంది. అంటే వైజాగ్ మైదానంలో కేవలం ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే ఇంగ్లండ్ జట్టు ఆడనుంది.

భారత్‌తో జరుగుతున్న హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జాక్ లీచ్ 63 పరుగులిచ్చి 26 ఓవర్లలో రోహిత్ శర్మ వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతనికి గాయమైంది. అతను కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అందులో అతను 33 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు.

భారత్‌కు నలుగురు స్పిన్నర్లు..

నలుగురు స్పిన్నర్లను టీమ్ ఇండియా రంగంలోకి దించే అవకాశం ఉందని సమాచారం. విశాఖపట్నం వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ మైదానంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా నలుగురు స్పిన్నర్లను బరిలోకి దింపాలని టీమ్ ఇండియా యోచిస్తోంది. దీని ప్రకారం భారత్ తరపున అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ రంగంలోకి దిగడం ఖాయం. వాషింగ్టన్ సుందర్‌కు మూడో స్పిన్నర్‌గా అవకాశం దక్కవచ్చు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఆడే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..