IND vs AUS Final: ఐసీసీ నాకౌట్‌లో భారత్ ప్రదర్శన.. ఆసీస్‌పై గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

India vs Australia: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టులోని ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంటుంది. ఇప్పటి వరకు టోర్నీలో ఇద్దరు ఆటగాళ్లు బ్యాట్‌తో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. ఇందులో కోహ్లి 700కి పైగా పరుగులు చేయగా, రోహిత్ 500కి పైగా పరుగులు చేశాడు. అందుకే ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి బ్యాట్ల నుంచి పరుగుల వర్షం కురుస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

IND vs AUS Final: ఐసీసీ నాకౌట్‌లో భారత్ ప్రదర్శన.. ఆసీస్‌పై గణాంకాలు ఎలా ఉన్నాయంటే?
Icc Knockout Matches Agains
Follow us

|

Updated on: Nov 18, 2023 | 3:05 PM

ప్రపంచ కప్ (ICC World Cup 2023) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య అక్టోబర్ 8 న లీగ్ మ్యాచ్ జరిగిన సమయంలో టోర్నమెంట్ చివరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్య జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. అయితే, ఇప్పుడు నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium in Ahmedabad)లో 5 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. ఐసీసీ నాకౌట్ (ICC Knockout) మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా రికార్డు ఇప్పటివరకు బాగానే ఉంది. కంగారూలను ఓడించడానికి టీమ్ ఇండియా తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా సత్తా చాటడం రోహిత్ సేన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

భారత్ నాలుగుసార్లు ఓడింది..

ఐసీసీ నాకౌట్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా అంత సులభం కాదు. అయితే, వివిధ ఐసీసీ ఈవెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ నాలుగుసార్లు కంగారూలను ఓడించడం ఓదార్పునిస్తోంది. 1998లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో భారత్ 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ నాకౌట్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండోసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

మూడోసారి 2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. అహ్మదాబాద్‌లోని ఇదే మైదానంలో 2011 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో చివరిసారిగా ఐసీసీ నాకౌట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇలా నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై భారత్ విజయం సాధించడం జట్టుకు బలం చేకూర్చింది. దీని ద్వారా రేపు ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఇదే తరహా ప్రదర్శన ఇస్తుందనేది అభిమానుల ఆశ.

అందరి దృష్టి రోహిత్-కోహ్లీపైనే..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టులోని ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంటుంది. ఇప్పటి వరకు టోర్నీలో ఇద్దరు ఆటగాళ్లు బ్యాట్‌తో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. ఇందులో కోహ్లి 700కి పైగా పరుగులు చేయగా, రోహిత్ 500కి పైగా పరుగులు చేశాడు. అందుకే ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి బ్యాట్ల నుంచి పరుగుల వర్షం కురుస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..