IND vs SL: భారత్, శ్రీలంక పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ అసంతృప్తి.. బిలో యావరేజ్ అంటూ..

|

Mar 20, 2022 | 5:44 PM

బెంగుళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మార్చి 12 నుంచి 15 వరకు భారత్-శ్రీలంక మధ్య డే-నైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమ్ ఇండియా 3 రోజుల్లో విజయం సాధించింది.

IND vs SL: భారత్, శ్రీలంక పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ అసంతృప్తి.. బిలో యావరేజ్ అంటూ..
India Vs Sri Lanka Test
Follow us on

భారత్-శ్రీలంక (IND vs SL)మధ్య రెండు టెస్టుల సిరీస్ ముగిసింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత జట్టు(Team INdia) 2-0 తేడాతో సులభంగా కైవసం చేసుకుంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ మొహాలీలో జరగగా, రెండో మ్యాచ్ బెంగుళూరులో జరిగింది. ఇది డే-నైట్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు చెలరేగడంతో బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పలేదు. ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ టెస్టుకు ఉపయోగించిన పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని వెల్లడించింది. బెంగుళూరు టెస్టుకు ఉపయోగించిన పిచ్‌ను ఐసీసీ(ICC) యావరేజ్‌గా రేటింగ్‌గా ఇచ్చింది.

ఐసీసీ మార్చి 20, ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు టెస్ట్‌లో ఉపయోగించిన పిచ్‌పై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ చిన్నస్వామి పిచ్‌పై తన నివేదికను సమర్పించారు. అందులో అతను పిచ్‌ సగటు కంటే తక్కువ రేట్ చేశాడు. ఐసీసీ ప్రకారం, శ్రీనాథ్ తన నివేదికలో, “మొదటి రోజు నుంచి పిచ్ చాలా తిరుగుతోంది. ప్రతి సెషన్‌లో అది మెరుగుపడినట్లు అనిపించినప్పటికీ, నా దృష్టిలో బంతి, బ్యాట్ మధ్య సమాన పోటీ లేదు” అని పేర్కొన్నాడు.

మ్యాచ్ రిఫరీ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఎం.చిన్నస్వామి స్టేడియంపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అలాగే శిక్ష విధించింది. ఇందులో భాగంగా చిన్నస్వామి స్టేడియానికి ఒక డీమెరిట్‌ పాయింట్‌ లభించగా, అది వచ్చే ఐదేళ్లపాటు వర్తిస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఈ సమయంలో ఒక వేదిక 5 డీమెరిట్ పాయింట్లను పొందినట్లయితే, అది 1 సంవత్సరం పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించకుండా నిషేధించనున్నారు.

Also Read: Shane Warne Funeral: షేన్ వార్న్‌కు తుది వీడ్కోలు పలికిన ఫ్యామిలీ.. క్లార్క్, సైమండ్స్ సహా 80 మంది హాజరు..

Kohli vs Babar: విరాట్ కోహ్లీ వర్సెస్ బాబర్ ఆజం.. ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్ సారథి ఏమన్నాడంటే?