Team India: ఈ పిల్లాడు ఇప్పుడు టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్.. టీ20 ప్రపంచ కప్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

|

Jul 10, 2024 | 8:53 AM

పై ఫొటోల్లో అమ్మానాన్నలతో కలిసి పోజులిస్తోన్నఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు పెరిగి పెద్ద వాడయ్యాడు. టీమిండియాలో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. తన ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్ము రేపే ఈ ఆటగాడు టీ20 స్పెషలిస్ట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మెరుపు ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు.

Team India: ఈ పిల్లాడు ఇప్పుడు టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్.. టీ20 ప్రపంచ కప్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Team India Criceter Childhood Photo
Follow us on

 

పై ఫొటోల్లో అమ్మానాన్నలతో కలిసి పోజులిస్తోన్నఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు పెరిగి పెద్ద వాడయ్యాడు. టీమిండియాలో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. తన ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్ము రేపే ఈ ఆటగాడు టీ20 స్పెషలిస్ట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మెరుపు ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లోనూ ఈ ప్లేయర్ భాగమయ్యాడు. కొన్ని ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడినా తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ త్వరగా ఔటయ్యాడు. టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరి, కీలకమైన సమయంలో క్రీజులోకి వచ్చిన ఈ ప్లేయర్ భారీ షాట్ కొట్టి ఔటయ్యాడు. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కానీ ఈ ఆటగాడే ఆ తర్వాత ప్రపంచ కప్ హీరోగా మారిపోయాడు. సంచలన క్యాచ్ పట్టి టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు టీమిండియా ధనాధన్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఇవి అతని చిన్ననాటి ఫొటోలు. పక్కన ఉన్నది సూర్య కుమార్ తల్లిదండ్రులే.

ఇవి కూడా చదవండి

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 10 భారీ సిక్సర్లు, 15 ఫోర్లతో మొత్తం 199 పరుగులు చేశాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని చాక చక్యంతో అందుకున్నాడు. ఈ క్యాచ్ కారణంగానే దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్ దూరమైందని క్రికెట్ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రపంచ కప్ తర్వాత విరామం తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ దంపతులు ఇటీవల ఉడిపిలో పర్యటించారు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి ఉడిపికి వచ్చిన అతను స్థానికంగా ఉండే కాపులోని మరిగుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

భార్య దేవిషాతో సూర్య కుమార్ యాదవ్..

టీమిండియా విక్టరీ పరేడ్ లో సూర్య కుమార్ యాదవ్..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..