ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో టీమిండియా నెక్స్ట్ హెడ్ కోచ్పై బీసీసీఐ వేట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లేయర్ల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానించింది కూడా. ఇక దీని డెడ్లైన్ కూడా సోమవారం రాత్రి 6 గంటలతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ రేసులో గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్,జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి దిగ్గజాలు ఉన్నారని వినికిడి. అయితే ఇవన్నీ రూమర్స్ అయినప్పటికీ.. నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్తో బీసీసీఐ చూపు.. గౌతమ్ గంభీర్ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గంభీర్ సైతం భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
కానీ అంతకముందు గంభీర్ బీసీసీఐకి ఓ కండిషన్ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘సెలక్షన్ గ్యారెంటీ’ పవర్స్ ఇస్తేనే.. ద్రావిడ్ వారసుడిగా ప్రధాన కోచ్ పదవిని చేపడతానని బీసీసీఐకి గంభీర్ చెప్పాడట. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు వినికిడి. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే హెడ్ కోచ్ బాధ్యతలను గంభీర్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా గంభీర్ మెంటార్ కేకేఆర్.. ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.