
India Playing 11 vs Pakistan: 2026 టి20 ప్రపంచ కప్లో తన రెండవ లీగ్ మ్యాచ్లో నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించి, భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 15 ఆదివారం నాడు భారత్ తన మూడవ లీగ్ మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. ఇక్కడ స్పిన్ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 గురించి టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు చేశాడు.
స్టార్ స్పోర్ట్స్లో ఇండియా-నమీబియా మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ గురించి చర్చలు జరిగాయి. ఈమేరకు ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ఒకే ఒక మార్పును సూచించాడు. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో భారత్ పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఇర్ఫాన్ తెలిపాడు.
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనింగ్ జోడీ కీలకం అవుతుందని, కానీ అభిషేక్ ఫిట్గా లేకుంటే, జట్టు దృఢమైన ఓపెనింగ్ జోడీతో ఆడాలని కోరుకుంటుందని ఇర్ఫాన్ తెలిపాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్లో సంజు బాగా ఆడాడు. అయితే అతను భారీ ఇన్నింగ్స్ స్కోర్ చేయలేకపోయాడు. కానీ అతను మంచి పురోగతిని కనబరిచాడు. అతను తన ఇన్నింగ్స్లో మూడు సిక్సర్లు కొట్టాడు. ఆ ఉద్దేశ్యం చాలా కీలకం అవుతుందని అన్నాడు.
సంజు శాంసన్/అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..