
England vs India, 3rd ODI: మూడవ వన్డేలో ఇంగ్లండ్ భారత్కు 388 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లార్డ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. బెన్ డకెట్ 135 బంతుల్లో 141 పరుగులు చేశాడు. జాకబ్ బెథెల్ 91 పరుగులు చేయగా, జో రూట్ అజేయంగా 74 పరుగులు చేశాడు. భారత్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తరఫున, బెన్ డకెట్, జాకబ్ బెథెల్ 192 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 31వ ఓవర్లో బెథెల్ను అవుట్ చేయడం ద్వారా ప్రసిద్ధ్ కృష్ణ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. బెథెల్ 93 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు చేశాడు.
బెథెల్ అవుటైన తర్వాత, డకెట్ జో రూట్తో కలిసి రెండో వికెట్కు 101 పరుగులు జోడించాడు. డకెట్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 141 పరుగులు చేశాడు. 44వ ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లోనే అతను క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, హ్యారీ బ్రూక్ను (14) ఔట్ చేశాడు. చివరగా జోస్ బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులు చేశాడు.
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..