
MS Dhoni : క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే అందరికీ చాలా ఇష్టం. ఆయన సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. కానీ, ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఒక ఫోటో ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే ధోని ఐపీఎల్ 2026లో ఆడతారో లేదో ఇంకా ఖచ్చితంగా తెలియదు. ఈ సమయంలో ఈ ఫోటో రావడం చాలా ఊహాగానాలకు దారి తీసింది.
వైరల్ అవుతున్న ఆ ఫోటో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తీసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలో ధోని నీలం రంగు జెర్సీ ధరించారు. ఆ జెర్సీపై ముంబై ఇండియన్స్ టీమ్ లోగో ఉంది. సీఎస్కేకు పెద్ద ప్రత్యర్థి అయిన ముంబై ఇండియన్స్ జెర్సీలో ధోనిని చూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఐపీఎల్ కెరీర్ మొత్తం దాదాపు సీఎస్కే కోసమే ఆడిన ధోని, ఈ ఫోటోతో సీఎస్కేకు దూరం అవుతారా అని కొంతమంది అభిమానులు ప్రశ్నించుకుంటున్నారు.
THALA MS DHONI IN MI JERSEY LOGO 😭 pic.twitter.com/f0lsmemKIs
— अभि 🇮🇳 (@abhi7781_) October 7, 2025
ధోని ఎప్పుడూ పసుపు రంగు (సీఎస్కే) జెర్సీతోనే గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి నీలం రంగు ఎంఐ లోగోతో కనిపించడం పెద్ద వార్తగా మారింది. 44 ఏళ్ల ధోని వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడతారా లేదా అనే చర్చలు ఇప్పటికే ఉన్నాయి. ఈ ఫోటో ఆ చర్చకు మరింత ఆజ్యం పోసింది. అయితే, ఈ ఫోటో గురించి ధోని కానీ, సీఎస్కే కానీ, ముంబై ఇండియన్స్ టీమ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ధోని 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతారని అంటున్నారు. గత సీజన్లో ఆడిన ధోని, ఐపీఎల్ 2026 గురించి ఇంకా ఖచ్చితమైన నిర్ణయం చెప్పలేదు. తన నిర్ణయాన్ని డిసెంబర్ వరకు చెబుతానని ఆయన ఇటీవల చెప్పారు. ఈ సందిగ్ధతలోనే ముంబై ఇండియన్స్ జెర్సీ ఫోటో వైరల్ కావడం మరింత గందరగోళానికి దారి తీసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..