ధావన్ మెరుపు ఇన్నింగ్స్.. ఢిల్లీ సూపర్ విక్టరీ

|

Apr 13, 2019 | 12:59 PM

కోల్‌కతా: ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో  7 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది ఢిల్లీ జట్టు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (65; 39 బంతుల్లో 7×4, 2×6), […]

ధావన్ మెరుపు ఇన్నింగ్స్.. ఢిల్లీ సూపర్ విక్టరీ
Follow us on

కోల్‌కతా: ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో  7 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది ఢిల్లీ జట్టు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (65; 39 బంతుల్లో 7×4, 2×6), ఆండ్రూ రసెల్ (45; 21 బంతుల్లో 3×4, 4×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఢిల్లీ.. లక్ష్య ఛేదనలో భాగంగా ధావన్ 97 పరుగులతో చెలరేగి నాటౌట్‌గా నిలవడంతో ఆ జట్టు 18.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.