మేడ్చల్ జిల్లా, జగద్గిరిగుట్టలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నరసింహ (67) అనే వ్యక్తి తన భార్య లక్ష్మి (63)తో గొడవపడి ఆమెను దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.