టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే

|

Mar 23, 2019 | 8:04 PM

చెన్నై: క్రికెట్ అభిమానులను ఎంతగానే అభిమానించే ఐపీఎల్ మొదటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా  చిదంబరం స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా అభిమానులతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన ప్లేయర్స్‌ను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు.  ఈ మ్యాచ్‌లో […]

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే
Follow us on

చెన్నై: క్రికెట్ అభిమానులను ఎంతగానే అభిమానించే ఐపీఎల్ మొదటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా  చిదంబరం స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా అభిమానులతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన ప్లేయర్స్‌ను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు.  ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

తుది జట్ల వివరాలు:

ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, ఏబీ డివీలియర్స్‌,   గ్రాండ్‌ హోమ్‌, ఉమేశ్‌ యాదవ్‌, చహల్‌, సిరాజ్‌, హెట్‌మెయిర్‌, శివం దుబె, నవదీప్‌ షైనీ

సూపర్‌కింగ్స్‌: ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌, సురేష్‌ రైనా, శార్దూల్‌ ఠాకూర్‌, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చహర్‌