AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayush Mhatre : వైభవ్ సూర్యవంశీ దాటేసిన ఆయుష్ మాత్రే.. అండర్-19 కెప్టెన్ కొత్త రికార్డు

అండర్-19 భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో 206 పరుగులు చేసి, అత్యధిక సిక్సర్లు (9) కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ, సౌరభ్ తివారీ రికార్డులను కూడా ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు.

Ayush Mhatre : వైభవ్ సూర్యవంశీ దాటేసిన ఆయుష్ మాత్రే.. అండర్-19 కెప్టెన్ కొత్త రికార్డు
Ayush Mhatre
Rakesh
|

Updated on: Jul 24, 2025 | 3:03 PM

Share

Ayush Mhatre : భారత క్రికెట్‌లో ప్రస్తుతం సిక్సర్లు కొట్టడంలో ఎవరు ముందున్నారని అడిగితే చాలా మంది వైభవ్ సూర్యవంశీ పేరే చెబుతారు. కానీ, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే, అతని ఓపెనింగ్ పార్టనర్, టీమిండియా అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే ఇప్పుడు అతని కంటే 2 సిక్సర్లు ఎక్కువగా కొట్టి కొత్త భారత రికార్డును సృష్టించాడు. అంతేకాకుండా, అండర్-19 టెస్ట్ మ్యాచ్‌లో 200 పరుగులకు పైగా చేసిన ఏకైక భారత కెప్టెన్‌గా కూడా ఆయుష్ నిలిచాడు. వైట్ బాల్ క్రికెట్‌లో సిక్సర్లు కొట్టడంలో వైభవ్ సూర్యవంశీకి తిరుగులేదని చెప్పడంలో సందేహం లేదు. కానీ, రెడ్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే, అండర్-19 క్రికెట్‌లో ఆయుష్ మాత్రే అందరికంటే టీమిండియా ప్లేయర్లలో అందరికంటే ముందున్నాడు. ఆయుష్ మాత్రే ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఆయుష్ మాత్రే ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన 2 యూత్ టెస్టుల్లో మొత్తం 9 సిక్సర్లు బాదాడు. ఇందులో 6 సిక్సర్లు ఒకే ఇన్నింగ్స్‌లో కొట్టినవే. 9 సిక్సర్లతో, అతను ఒక యూత్ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు సౌరభ్ తివారీ పేరిట ఉండేది. అతను 2007-08లో జరిగిన సిరీస్‌లో 8 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన 4 మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్‌లో 7 సిక్సర్లు కొట్టాడు. వైభవ్, సౌరభ్ తివారీ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. కానీ, ఇప్పుడు ఆయుష్ మాత్రే కేవలం సౌరభ్ తివారీ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, వైభవ్ సూర్యవంశీ కంటే కూడా 2 సిక్సర్లు ఎక్కువగా కొట్టాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో ఆయుష్ కేవలం అత్యధిక సిక్సర్లు కొట్టడంలోనే కాదు, కెప్టెన్‌గా ఒక యూత్ టెస్ట్ సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు, అంతకు మించి 200 పరుగులకు పైగా చేసిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల ఆయుష్ మాత్రేకు ఈ విజయం రెండో యూత్ టెస్ట్‌లో లభించింది. అక్కడ అతను మొదటి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగులు చేస్తూ మొత్తం 206 పరుగులు సాధించాడు. ఈ విషయంలో ఆయుష్ 19 సంవత్సరాల పాత రికార్డును బద్దలు కొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు తన్మయ్ శ్రీవాస్తవ పేరిట ఉండేది, అతను 2006లో యూత్ టెస్ట్ సిరీస్‌లోని ఒక మ్యాచ్‌లో 199 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..