IND vs NZ 2nd ODI Playing XI: సుందర్ ఔట్.. గంభీర్ 2వ శిష్యుడు ఇన్.. రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?

India vs New Zealand 2nd ODI Playing XI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరం కావడంతో యువ సంచలనం ఆయుష్ బదోనీకి తొలిసారి జాతీయ జట్టులో పిలుపు లభించింది. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

IND vs NZ 2nd ODI Playing XI: సుందర్ ఔట్.. గంభీర్ 2వ శిష్యుడు ఇన్.. రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?
Ind Vs Nz 2nd Odi

Updated on: Jan 12, 2026 | 6:58 PM

India vs New Zealand 2nd ODI Playing XI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు గాయాల బెడద తప్పడం లేదు. తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత్‌కు వాషింగ్టన్ సుందర్ గాయం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో ఆయన సిరీస్ మొత్తానికి దూరం కాగా, ఆయన స్థానంలో ఢిల్లీ బ్యాటర్ ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేలో బదోనీ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రిషబ్ పంత్ సైడ్ స్ట్రెయిన్ కారణంగా సిరీస్‌కు దూరం కాగా, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా అదే బాటలో నడిచాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ ఎడమ పక్కటెముకల భాగంలో అసౌకర్యానికి గురయ్యాడు. ఆ తర్వాత ఆయన బ్యాటింగ్ చేసినప్పటికీ, గాయం తీవ్రత దృష్ట్యా వైద్య బృందం ఆయనకు విశ్రాంతిని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Rohit Sharma: ప్రపంచ రికార్డుతో హిట్‌మ్యాన్ రచ్చ.. క్రికెట్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..

ఇవి కూడా చదవండి

ఆయుష్ బదోనీకి లక్కీ ఛాన్స్.. సుందర్ స్థానంలో ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆయుష్ బదోనీని సెలెక్టర్లు ఎంపిక చేశారు. బదోనీ కేవలం బ్యాటరే కాకుండా ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. దీంతో ఆల్‌రౌండర్ కోటాలో ఆయన తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం బదోనీకి అదనపు బలం.

బౌలింగ్ విభాగంలో మార్పులు?

రెండో వన్డేలో భారత బౌలింగ్ విభాగంలో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు. తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు తీయడంలో తడబడటంతో, రాజ్‌కోట్ పిచ్ పరిస్థితిని బట్టి ప్రసిద్ధ్ కృష్ణ లేదా మరేదైనా ప్రత్యామ్నాయాన్ని యాజమాన్యం ఆలోచిస్తోంది. అయితే అర్ష్‌దీప్‌కు మరో అవకాశం ఇచ్చేందుకే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.

సిరీస్ విజయంపై కన్ను..

తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (93) అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్‌లో జరగబోయే రెండో మ్యాచ్‌లో గెలిస్తే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు కివీస్ జట్టు సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.

భారత తుది జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, ఆయుష్ బదోనీ/నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..