IPL Match: క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్, హైదరాబాద్, చెన్నై మ్యాచ్‌పై ఉత్కంఠ

|

Apr 04, 2024 | 9:12 PM

ప్రస్తుత 2024 ఐఎపీల్ మ్యాచులు క్రికెట్ అభిమానులను ఓ రేంజ్ లో ఉర్రుతలూగిస్తున్నాయి. జట్ల మధ్య కీలక పోరు నడుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. తమ అభిమాన జట్టు టాప్ పోజిషన్ ఉంటుందా లేదా, ఈసారైనా కప్ కొడుతుందాఅని ఊపిరి బిగపట్టి మ్యాచ్ లు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL Match: క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్, హైదరాబాద్, చెన్నై మ్యాచ్‌పై ఉత్కంఠ
Uppal Stadium
Follow us on

ప్రస్తుత 2024 ఐఎపీల్ మ్యాచులు క్రికెట్ అభిమానులను ఓ రేంజ్ లో ఉర్రుతలూగిస్తున్నాయి. జట్ల మధ్య కీలక పోరు నడుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. తమ అభిమాన జట్టు టాప్ పోజిషన్ ఉంటుందా లేదా, ఈసారైనా కప్ కొడుతుందాఅని ఊపిరి బిగపట్టి మ్యాచ్ లు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు ముందు రోజే షాక్ ఇచ్చే వార్త ఒకటి వెలుగుచూసింది. ఉప్పల్ స్టేడియాన్ని కరెంట్ కష్టాలు వెంటాడుతుండటంతో అభిమానులతో పాటు స్టేడియం నిర్వాహకులకు షాక్ తగిలినట్టయింది.

అయితే కొన్ని నెలల నుండి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు స్టేడియానికి కరెంట్ కట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే కీలక మ్యాచ్ కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేసి షాక్ ఇచ్చారు. కొన్ని నెలల నుండి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకపోవడం వల్ల కరెంటు ను నిలిపివేసినట్టు తెలుస్తోంది. అయితే తమకు మ్యాచ్ చూసేందుకు టికెట్ ఇవ్వకపోవడంతో అధికారులు కట్ చేసినట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖ అడిగిన పాసులు ఇవ్వక పోవడంతో పవర్ కట్ చేశారని హెచ్ సీఏ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఉప్పల్ స్టేడియం లో ipl మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.

కాగా శుక్రవారం ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ ఆడనుండటంతో అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఎంఎస్ ధోనీ మెరుపులు క్రికెట్ అభిమానులను ఫిదా చేస్తుండటంతో  ఆరెంజ్ జెర్సీల కంటే పసుపు రంగు జెర్సీలే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.  ఈ సీజన్ లో గత మ్యాచ్ లో చెన్నై తొలి ఓటమిని చవిచూసినప్పటికీ ధోనీ మెరుపు బ్యాటింగ్ చేయడంతో (16 బంతుల్లో 37 పరుగులు) అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.