ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణం సాధించిన పి.యూ.చిత్ర
దోహాలో జరుగుతున్న 2019 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పి.యూ.చిత్ర 1500 మీటర్ల ఉమెన్స్ ఫైనల్లో కేవలం 4 నిముషాల 14.56 సెకండ్లలో పరిగెత్తి మన భారతదేశానికి విజయాన్ని తీసుకువచ్చింది. పోటాపోటీగా సాగిన ఈ ఫైనల్ లో చిత్ర అద్భుతంగా రాణించి స్వర్ణం సంపాదించింది. కాగా పోటీ ప్రారంభం నుంచి లీడింగ్ లో ఉన్న బహరేన్ కు చెందిన గశ్య టిజెస్ట్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దోహాలో జరుగుతున్న 2019 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పి.యూ.చిత్ర 1500 మీటర్ల ఉమెన్స్ ఫైనల్లో కేవలం 4 నిముషాల 14.56 సెకండ్లలో పరిగెత్తి మన భారతదేశానికి విజయాన్ని తీసుకువచ్చింది. పోటాపోటీగా సాగిన ఈ ఫైనల్ లో చిత్ర అద్భుతంగా రాణించి స్వర్ణం సంపాదించింది. కాగా పోటీ ప్రారంభం నుంచి లీడింగ్ లో ఉన్న బహరేన్ కు చెందిన గశ్య టిజెస్ట్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.