
ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో కారును నడిపినట్టు పోలీసులు తెలిపారు. స్పీడ్తో దూసుకొచ్చిన కారు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. రెండు వాహనాలు ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.