
జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరించడం ఉత్తర భారతదేశంలో సంప్రదాయం. మర్రిచెట్టును, సావిత్రి దేవిని సత్యవానుడిని పూజించడం ద్వారా అఖండమైన సౌభాగ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2026 సంవత్సరంలో ఈ పవిత్రమైన వ్రతం ఎప్పుడు వస్తుందో, ఆ రోజున ఏర్పడుతున్న ప్రత్యేక శుభ యోగాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
2026 వట సావిత్రి వ్రత తేదీ ముహూర్తం
వేద క్యాలెండర్ ప్రకారం, జ్యేష్ఠ మాస అమావాస్య తిథి మే 16, 2026 శనివారం నాడు వస్తోంది. అమావాస్య తిథి మే 16న ఉదయం 5:11 గంటలకు ప్రారంభమై, మే 17 తెల్లవారుజామున 1:30 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, ఉదయ లగ్నం ప్రామాణికంగా మే 16న ఈ వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభప్రదం.
ఈ ఏడాది ఏర్పడుతున్న ప్రత్యేక యోగాలు
మే 16న ‘సౌభాగ్య యోగం, శోభన యోగం కలయికతో ఈ వ్రతం మరింత శక్తివంతంగా మారింది. ఉదయం నుండి 10:26 వరకు సౌభాగ్య యోగం ఉంటుంది, ఇది మహిళల అదృష్టాన్ని, సంతోషాన్ని వృద్ధి చేస్తుంది. అటుపై శోభన యోగం ప్రారంభమవుతుంది. ఈ శుభ యోగాలలో వ్రతం చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు మరింతగా లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
పూజా సమయాలు (ముహూర్తాలు)
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:07 నుండి 4:48 వరకు.
ఉత్తమ ముహూర్తం: ఉదయం 7:12 నుండి 8:54 వరకు.
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:45 వరకు.
చర-సామాన్య ముహూర్తం: మధ్యాహ్నం 12:18 నుండి 2:00 వరకు.
వట సావిత్రి, వ్రత ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, సావిత్రి దేవి తన భర్త సత్యవానుడి ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి పొందిన రోజు ఇదే. మర్రిచెట్టు (వట వృక్షం) సాక్షిగా జరిగిన ఈ ఘటన, మహిళల అచంచలమైన భక్తికి, ధైర్యానికి నిదర్శనం. ప్రతి ఏటా మహిళలు తమ భర్తల క్షేమం కోసం, వైవాహిక జీవితం సుఖమయం కావాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారు.
గమనిక:
ఈ సమాచారం వేద పంచాంగం పండితుల సూచనల ఆధారంగా రూపొందించబడింది. ఆచార వ్యవహారాలు ప్రాంతాలను బట్టి స్వల్పంగా మారవచ్చు. స్థానిక పండితుల సలహా మేరకు పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవడం ఉత్తమం.