Puttaparthi: ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగాలని.. ప్రపంచ శాంతి కోరుతూ విదేశీయులు పుట్టపర్తిలో ప్రత్యేక హోమం

|

Mar 04, 2022 | 7:27 AM

Puttaparthi: రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అనేక దేశాల ప్రజలు ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించి శాంతి బాటలో పయనించాలని..

Puttaparthi: ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగాలని.. ప్రపంచ శాంతి కోరుతూ విదేశీయులు పుట్టపర్తిలో ప్రత్యేక హోమం
Vishwa Shanthi Homam At Pu
Follow us on

Puttaparthi: రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అనేక దేశాల ప్రజలు ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించి శాంతి బాటలో పయనించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా(Anantapuram District)లో ఉక్రెయిన్ రష్యా దేశాలు యుద్దాన్ని విరమించి శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ విదేశీయులు ప్రత్యేక హోమం నిర్వహించారు. ప్రపంచ శాంతి నెలకొనాలని దుర్గాదేవి, సాయిబాబాను వేడుకుంటూ శాంతి హోమం జరిపించారు విదేశీయులు.

జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో విదేశీయులు విశ్వ శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక హోమం నిర్వహించారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ముగిసి పోవాలని ప్రపంచంలో శాంతి నెలకొనాలని భగవాన్ సత్యసాయి బాబా, దుర్గా దేవిని ప్రార్థిస్తూ దుర్గాదేవి ఆలయంలో వేద బ్రాహ్మణుడు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాంతి హోమం చేశారు. కరోనా రక్కసి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మానవాళిలో అశాంతిని రాజేసిందన్నారు. యుద్ధం వీలైనంత త్వరగా పరిసమాప్తం కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళి సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

విద్వేషాలు వివక్ష మాని మనుషులందరూ ప్రశాంత జీవితం సాగించాలని కోరుకున్నారు. విద్వేషాలకు లోనవుతున్న వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వారు ప్రార్థించారు. ప్రపంచ దేశాల్లో మానవాళికి ఇబ్బందులు కలుగకుండా సమన్వయంతో సత్సంబంధాలు కలిగి ఉండాలని వారు నవగ్రహ, గణపతి హామాలతో పాటు శాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో విదేశీ భక్తులతో పాటు స్థానికులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read:

ఈరోజు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి..నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..