Srisailam: శ్రీశైలంలో కనుల పండువగా ప్రారంభమైన భ్రమరాంబ దేవికి వార్షిక కుంభోత్సవం

| Edited By: Balaraju Goud

Apr 26, 2024 | 10:56 AM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు.

Srisailam: శ్రీశైలంలో కనుల పండువగా ప్రారంభమైన భ్రమరాంబ దేవికి వార్షిక కుంభోత్సవం
Kumbhotsavam Of Goddess Bhramaramba
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు. అచారాన్ని అనుసరించి ఈ పూజలన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత అమ్మవారి ఆలయ ముందుభాగంలో రజకునిచేత ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్వికబలి ఇచ్చారు

ఈ సందర్బంగా అమ్మవారికి వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలను, నిమ్మకాయల సాత్విక బలిగా ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు భక్తులు సమర్పించారు. అయితే సాయంకాలం మల్లికార్జునస్వామికి మహా మంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శోంఠి భక్షాలతో కప్పివేశారు. అలాగే అమ్మవారికి ఆలయ ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ ప్రధానఘట్టం కుంభ హారతి అనంతరం మళ్ళీ రెండోవ విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…