Kedarnath Yatra: కేధార్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. మేలో తెరుచుకోనున్న తలుపులు ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే

ఆరు నెలలకు ఒకసారి తెరుచుకునే కేదార్‌నాథ్ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది బోలేనాథ్ దర్శనం కోసం బారులు తీరతారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మే 10 వ తేదీ 2024న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. అయితే ఈ యాత్ర ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చు.  దీంతో కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి.  

Kedarnath Yatra: కేధార్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. మేలో తెరుచుకోనున్న తలుపులు ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే
Kedarnath Temple

Updated on: Apr 05, 2024 | 8:59 AM

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి కేధార్ నాథ్. ఉత్తరాఖండ్‌లోని మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేధార్ నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా జీవితంలో  దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కేధార్ నాథ్ ఆలయం తలుపు  తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పుడు కేదార్ నాథ్ ఆలయం తలపులు ఎపుడు తెరుచుకుంటాయి. శివయ్యను ఎప్పటి నుంచి దర్శనం చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ఈ ఆలయంమే అక్షయ తృతీయ నుంచి నవంబరు (కార్తీక్ పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే తెరచి ఉంటుంది. భక్తుల దర్శనానికి అంటే ఆరు నెలలకు ఒకసారి తెరుచుకునే కేదార్‌నాథ్ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురుచూస్తూ ఉంటారు. 2024 సంవత్సరంలో, మే 10న ఉదయం 6:30 గంటలకు పవిత్ర మందిరం తలుపులు తెరవబడతాయి

ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది బోలేనాథ్ దర్శనం కోసం బారులు తీరతారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మే 10 వ తేదీ 2024న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. అయితే ఈ యాత్ర ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చు.  దీంతో కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఏ ఏ మార్గాల్లో కేదార్ నాథ్ చేరుకోవచ్చు అంటే

ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుంచి 22 కి.మీ ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్‌నాథ్‌ ఆలయం చేరుకోవచ్చు. కొందరు కాలినడకన వెళ్తారు. కాలినడకన వెళ్తే దాదాపు 16 కిలో మీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రస్తుతం కేధార్ నాథ్ ఆలయానికి చేరుకోవడానికి  హెలిక్యాప్టర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దీనికి ముందుగా హెలికాఫ్టర్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Loading...
Unable to load recommendations.
Follow Us