Garuda Purana: గరుడ పురాణంలో అనేక నరకాలు.. ఏ కర్మకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో తెలుసుకోండి…

|

Jan 28, 2022 | 1:21 PM

Garuda Purana: హిందువులు(Hindus) దేవుడు, దెయ్యం, కర్మ, ఫలితం వంటి వాటి మీద ఆధారపడి జీవితం నడుస్తుందని నమ్ముతారు. గరుడపురాణం(Garuda Purana)లో మానవుడు చేసే తప్పులకు శిక్షలు..

Garuda Purana: గరుడ పురాణంలో అనేక నరకాలు.. ఏ కర్మకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో తెలుసుకోండి...
Gasruda Purana
Follow us on

Garuda Purana: హిందువులు(Hindus) దేవుడు, దెయ్యం, కర్మ, ఫలితం వంటి వాటి మీద ఆధారపడి జీవితం నడుస్తుందని నమ్ముతారు. గరుడపురాణం(Garuda Purana)లో మానవుడు చేసే తప్పులకు శిక్షలు విధిస్తారని విశ్వాసం. ఏ పాపానికి ఏ శిక్ష విధించబడుతుందో గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు.

ఇతరుల ఇల్లు, పొలం, కొట్టు లేదా గోదాము మొదలైనవాటికి ఉద్దేశపూర్వకంగా నిప్పంటించేవారు నరకానికి చేరుకుంటారు. వారికి అక్కడ చుట్టూ అగ్ని ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ‘మహారౌరవ’ అంటారు. గో వధ చేసిన వారిని పదునైన ఇనుప ముళ్ళు ఉన్న ప్రదేశంలో ఉంచుతారు. ఈ ప్రదేశాన్ని ‘మహావిచి’ అంటారు.

బ్రాహ్మణులను చంపి ఇతరుల భూమిని లాక్కునేవారిని వేడి ఇసుక, బొగ్గులతో నిండిన నరకంలో ఉంచుతారు. దీనిని ‘కుంభీపాక్’ అంటారు. అమాయకులను ఇరికించి, వారిని బందీలుగా తీసుకెళ్లే వారు మండుతున్న ఇనుముతో కూడిన మండుతున్నమంటలపై ఉంచి శిక్షిస్తారు. ఈ ప్రదేశాన్ని ‘మంజుష్’ అంటారు.

తప్పుడు సాక్ష్యం చెప్పేవారిని కాల్చిన ఇనుప బాణాలతో కట్టివేస్తారు. ఈ ప్రదేశాన్ని ‘రౌరవ’ అంటారు. మరోవైపు, బ్రాహ్మణులను వేధించే వారిని వాంతులు, మూత్రం వంటి వ్యర్ధాలు నిండిన ప్రదేశంలో ఉంచి శిక్షిస్తారు. ఈ ప్రదేశాన్ని ‘అప్రతిష్ఠ’ అంటారు.

మద్యం సేవించే బ్రాహ్మణులను లక్షలాది శులాలు కాల్చి ఆ ప్రదేశంలో ఉంచుతారు. ఈ ప్రదేశాన్ని ‘విల్లేపాక్’ అంటారు. పరాయి స్త్రీతో సంభోగించిన వారిని ‘జయంతి’ అనే నరకంలో ఉంచి.. పెద్ద ఇనుప బండ కింద నొక్కి శిక్షిస్తారు.

అనేక మంది పురుషులతో రిలేషన్ పెట్టుకున్న స్త్రీలను ముళ్ళతో నిండిన ప్రదేశంలో ఉంచుతారు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే వారికి ‘మహాప్రభ’ అనే నరకంలో ఉంచి శిక్ష విధిస్తారు.

Also Read :

ఓటీటీలో రిలీజ్ కు ‘వై ఐ కిల్డ్ గాంధీ’ రెడీ.. స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..