Vijayawada: ఇంద్రకీలాద్రిపై సౌకర్యాలు కరవు.. మండుటెండలో భక్తుల ఇబ్బందులు

|

Apr 25, 2022 | 9:25 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల(Tirumala) తరువాత పెద్ద దేవాలయంగా పేరుగాంచిన విజయవాడ(Vijayawada) లోని ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలో కనీస సౌకర్యాలు కరవయ్యాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి నిత్యం 30 నుంచి 50 వేల మంది...

Vijayawada: ఇంద్రకీలాద్రిపై సౌకర్యాలు కరవు.. మండుటెండలో భక్తుల ఇబ్బందులు
Indrakeeladri
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల(Tirumala) తరువాత పెద్ద దేవాలయంగా పేరుగాంచిన విజయవాడ(Vijayawada) లోని ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలో కనీస సౌకర్యాలు కరవయ్యాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి నిత్యం 30 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారు. ఘాట్‌ రోడ్డులో భక్తులు మొక్కులు చెల్లించుకునే పొంగళ్ల షెడ్డును 2015లో క్లోక్‌ రూమ్‌గా మార్చారు. రూ.30 లక్షలతో నిర్మించిన ఈ షెడ్డులో గ్యాస్‌ స్టౌవ్‌లు అమర్చారు. పొగ బయటకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దానిని క్లోక్‌ రూమ్‌గా మార్చడంతో భక్తులు తమ సామగ్రిని అందులో  భద్రపరుచుకుంటున్నారు.  వర్షం వస్తే క్లోక్‌ రూమ్‌ మొత్తం తడిసి వస్తువులు పాడవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోతోంది. దేవస్థానానికి లక్షల రూపాయలు ఆదాయం వస్తున్నా.. పాదరక్షలు, ఫోన్లు దాచుకునే స్టాండ్ల వద్ద భద్రత కరవైంది. చుట్టూ రక్షణ లేకపోవడంతో బ్యాగులు, ఫోన్లు కూడా అపహరణకు గురవుతున్నాయి.

శాశ్వత ప్రాతిపదికన చెప్పులు, ఫోన్లు, బ్యాగులు భద్రపరిచేందుకు వీలుగా నిర్మాణాలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. పొంగళ్ల షెడ్డును కూడా భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టినందున కొంత ఆలస్యమైందని.. భక్తులు కాళ్లు కాలకుండా కొన్ని చోట్ల వెదురు తడికలు వేయించామని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

Tiruapati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన