తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

|

Nov 02, 2022 | 1:37 PM

మంగళవారం తిరుమల ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు..టన్నుల కొద్దీ వివిధ రకాల పూలు, ఆకులతో ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Ttd Brahmotsavam 2022
Follow us on

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం స్వామివారిని 72,176 మంది భక్తులు దర్శించుకోగా 25,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరో వైపు తిరుమల,తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు టైంస్లాట్‌ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాల వ‌ద్ద మంగ‌ళ‌వారం అర్ధరాత్రి నుంచి స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పునఃప్రారంభించారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగ‌తా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేయనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్ ల‌భించిన భ‌క్తుడు అదేరోజు ద‌ర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామ‌ని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు.

ప్రస్తుతం తిరుమల శ్రీవారికి వార్షిక పుష్పయాగం నిర్వహిస్తున్నారు. మంగళవారం తిరుమల ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా గార్డెన్ కార్యాలయం నుంచి తిరుమల ఆలయం వరకు టన్నుల కొద్దీ వివిధ రకాల పూలు, ఆకులతో ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి