Sri Ramanavami 2022: శ్రీరామ నవమి సందర్భంగా అరుదైన దృశ్యం.. 5 లక్షల దీపాలతో శ్రీరాముని చిత్ర పటం

|

Apr 08, 2022 | 9:34 AM

Sri Ramanavami 2022: బీహార్(Bihar) శ్రీరామ నవమి సందర్భంగా చరిత్ర సృష్టించింది. భగల్​పుర్(Bhagalpur) లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏప్రిల్​10న శ్రీరామనవమిని పురస్కరించుకొని రామ నవమికి..

Sri Ramanavami 2022: శ్రీరామ నవమి సందర్భంగా అరుదైన దృశ్యం.. 5 లక్షల దీపాలతో శ్రీరాముని చిత్ర పటం
Shri Ram With 5 Lakh Lamps
Follow us on

Sri Ramanavami 2022: బీహార్(Bihar) శ్రీరామ నవమి సందర్భంగా చరిత్ర సృష్టించింది. భగల్​పుర్(Bhagalpur) లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏప్రిల్​10న శ్రీరామనవమిని పురస్కరించుకొని రామ నవమికి ముందు 150 అడుగుల పొడవైన రాముడి చిత్రాన్ని రూపొందించారు. భాగల్‌పూర్‌లోని లజ్‌పత్ పార్క్ మైదానంలో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 లక్షల దీపాలతో శ్రీరాముని చిత్ర పటాన్ని తయారుచేశారు. ఈ చిత్ర తయారీకి గత ఐదు రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వాహుకుడు అర్జిత్​ చౌబే మాట్లాడుతూ.. 12 రకాల రంగులతో 150 అడుగుల ఎత్తులో శ్రీరాముడు చిత్ర పటాన్ని చిత్రీకరించామని చెప్పారు. ఇది
ప్రపంచ రికార్డు అవుతుందని అన్నారు. ఇప్పటికే  గిన్నిస్ బుక్​ ఆఫ్​ రికార్డ్​ లో నమోదు చేసే జట్టు.. ఏప్రిల్ 6వ తేదీన భాగల్‌పూర్‌కు చేరుకుందని తెలిపారు.

ఏప్రిల్ 10 వ తేదీన జరిగే శ్రీ రామ నవమి రోజు జరిగే కార్యక్రమానికి బిహార్​ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్​, కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే సహా పలువురు కేంద్ర మంత్రులు , ఎంపీలు హాజరుకానున్నారు.

Also Read: Andhra Pradesh: సీఎం జగన్ గుడ్‌న్యూస్.. నేడు నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ

Health Tips: మండే ఎండలు.. మీకు తరచూ వేడి చేస్తుందా.. ఇదిగో టిప్స్

AP Crime News: పెళ్ళికి కట్నం అడిగిన ప్రేమించిన యువకుడు.. మనస్తాపంతో లాయర్ స్టూడెంట్ సూసైడ్..