హైదరాబాద్లో ఘోరం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి కెపీహెచ్బీ కాలనీలో సతీశ్ అనే సాఫ్ట్వేర్ విగతజీవిగా కనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన సతీశ్ ఉద్యోగరీత్యా నగరంలోని మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. మరో స్నేహితుడితో కలిసి అతడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం సతీశ్ అదృశ్యమయ్యాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సతీశ్ స్నేహితుడిపైనా అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్నేహితుడి […]
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి కెపీహెచ్బీ కాలనీలో సతీశ్ అనే సాఫ్ట్వేర్ విగతజీవిగా కనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన సతీశ్ ఉద్యోగరీత్యా నగరంలోని మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. మరో స్నేహితుడితో కలిసి అతడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం సతీశ్ అదృశ్యమయ్యాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సతీశ్ స్నేహితుడిపైనా అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్నేహితుడి గదికి వెళ్లి చూడగా సతీశ్ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వ్యాపార లావాదేవీలే సతీశ్ హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.