
ఆంధ్రప్రదేశ్పై తన విజన్ గురించి ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘పారదర్శక పాలనతో.. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. అవినీతి రహిత, వికేంద్రీకృత ప్రభుత్వంతో మీ ఇంటి వద్దకే పాలన అందేలా.. స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే నా విజన్’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను వైసీపీ అభిమానులు రీట్వీట్ చేస్తూ జై జగన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఉగాది సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోను జగన్ శనివారం విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
My vision for AP – a transparent, technology-driven, corruption-free, decentralised Govt, at your doorstep; with sustainable development; to be a forerunner state in the country.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2019