
అమరావతి: రేపటితో ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. వైసీపీ అధినేత జగన్ ప్రచారం చివరి రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలో, అనంతరం 11.30 గంటలకు కర్నూలులో, మధ్యాహ్నాం 2 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనన్నారు. తిరుపతి నియోజవర్గంతో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ముగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటనను విడుదల చేశారు.