బాండ్‌ పేపర్‌పై మేనిఫెస్టో రాసిస్తా: లక్ష్మీనారాయణ

|

Mar 28, 2019 | 3:07 PM

అవినీతి మచ్చ లేేని అధికారిగా పేరు తెచ్చుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో కూడా తన విభిన్నతను చాటుకుంటున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  వైజాగ్‌కి మేనిఫెస్టోను బాండ్‌ పేపర్‌ మీద రాసివ్వబోతున్నానని జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ చెప్పారు.ఆయన మాట్లాడుతూ ‘బాండ్ పేపర్ మీద మేనిఫెస్టో ఇవ్వబోతున్నాను. ఆ ధైర్యం మాకు ఉంది. ఒకవేళ మేనిఫెస్టోలోవి నేను చేయకపోతే రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు’ అని […]

బాండ్‌ పేపర్‌పై మేనిఫెస్టో రాసిస్తా: లక్ష్మీనారాయణ
Follow us on

అవినీతి మచ్చ లేేని అధికారిగా పేరు తెచ్చుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో కూడా తన విభిన్నతను చాటుకుంటున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  వైజాగ్‌కి మేనిఫెస్టోను బాండ్‌ పేపర్‌ మీద రాసివ్వబోతున్నానని జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ చెప్పారు.ఆయన మాట్లాడుతూ ‘బాండ్ పేపర్ మీద మేనిఫెస్టో ఇవ్వబోతున్నాను. ఆ ధైర్యం మాకు ఉంది. ఒకవేళ మేనిఫెస్టోలోవి నేను చేయకపోతే రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు’ అని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముందే పవన్‌ కల్యాణ్‌తో తాను చర్చించానని ఆయన చెప్పారు. తనను అన్ని పార్టీలు ఆహ్వానించాయని చెప్పిన జేడీ.. జీరో బడ్జెట్ రాజకీయాలు చేసేవారితో కలవాలన్న ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపానని చెప్పారు.