Jogu Ramanna: చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి.. రేవంత్‌పై జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు..

|

Aug 10, 2021 | 2:19 PM

కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభ పొలిటికల్ హీట్‌ను పెంచింది. రేవంత్ రెడ్డిపై ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రతినిధులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి సభ నిర్వహించారని ఆరోపించారు మాజీ...

Jogu Ramanna: చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి.. రేవంత్‌పై జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు..
Jogu
Follow us on

కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభ పొలిటికల్ హీట్‌ను పెంచింది. రేవంత్ రెడ్డిపై ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రతినిధులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి సభ నిర్వహించారని ఆరోపించారు మాజీ మంత్రి జోగు రామన్న. ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ,బీజేపీ చీకటి ఒప్పందం లో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగింది. ఆ రెండు పార్టీ లకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరం లో లేదు అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.

పగటి దొంగ రేవంత్ కు తగిన శాస్తి లభిస్తుంది. దళిత ,గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమి లేదు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది TRS ప్రభుత్వమే అని అన్నారు మంత్రి జోగు రామన్న. గతం లో గిరిజన, ఆదివాసీ పండగలను సంస్కృతిని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే ఇపుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు మంత్రి జోగు రామన్న.

పోడు భూముల సమస్య పరిష్కారం కరోనా వల్ల కొంత ఆగింది. దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. త్వరలోనే అవి పరిష్కారమవుతాయి అని… దళిత ,గిరిజన ,ఆదివాసీ కుటుంబాలకు వెలుగునిచ్చింది ఇచ్చేది CM KCR  మాత్రమే అని పేర్కొన్నారు మంత్రి జోగు రామన్న.

ఇవి కూడా చదవండి:  Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి