పంజాబ్ : ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎంపీ హరిందర్ సింగ్ ఖల్సా బీజేపీ గూటికి చేరారు. ఫతేగఢ్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరిందర్ సింగ్ ఇవాళ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీనే అని ఈ సందర్భంగా హరిందర్సింగ్ అన్నారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన హరిందర్ సింగ్ 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్పై ఎంపీగా గెలిచారు. అయితే ఆప్ 2015లో హరిందర్ సింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆప్కి దూరంగా ఉన్న హరిందర్ సింగ్.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కమలం గూటికి చేరారు.