Anjan Kumar Yadav : ‘ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా’.. : కొత్త పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంజన్ కుమార్ యాదవ్

|

Jun 27, 2021 | 5:34 PM

ఊరురు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా.. అని చెప్పారు కొత్తగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎంపికైన మాజీ ఎంపీ అంజన్ కుమార్..

Anjan Kumar Yadav : ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా.. : కొత్త పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంజన్ కుమార్ యాదవ్
Anjan Kumar Yadav
Follow us on

PCC working working president Anjan Kumar yadav : ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా.. అని చెప్పారు కొత్తగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎంపికైన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానం ఇచ్చినందుకు ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంకి కృషి చేస్తా.. బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయి కి వచ్చా” అని అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. 2004 నుండి… పార్టీ లో కీలకంగా పని చేశానని, తెలంగాణ కోసం కొట్లడింది మేమేనని అంజన్ తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వండని ఆయన తెలంగాణ ప్రజలకు విన్నవించారు.

టీఆర్ఎస్ పార్టీ అర చేతిలో వైకుంఠం చూపిస్తుందని.. ప్రజల కాళ్ళు మొక్కి అయినా కేసీఆర్ అబద్దాల మాటలు విడమర్చి చెప్తామని అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. తెలంగాణ వద్దన్నోల్లు మంత్రి అయ్యారన్న ఆయన, తెలంగాణ కోసం కొట్లాడిన ఎంపిలం అధికారం కి దూరం అయ్యాము అని వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ… ఇప్పుడు అప్పుల తెలంగాణ అయ్యిందన్నారు.

బీజేపీ… టీఆర్ఎస్ రెండూ ఒకటే .. తోడు దొంగలు అని అంజన్ విమర్శించారు. “సోనియా గాంధీ ఎవరిని అధ్యక్షుడిని చేస్తే వారితో పని చేస్తాం.. కాంగ్రెస్ తిరిగి అధికారం లోకి తేవడం మా కర్తవ్యం.. తెలంగాణ ఇచ్చింది దోచుకోవడం కోసం కాదు, అన్ని వర్గాలు బాగుపడాలని” అని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Read also : Revanth Reddy : రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ.. పార్టీ సీనియర్లతోపాటు, జిల్లాల నుంచి పెద్దఎత్తున శుభాకాంక్షలు