విజయవాడ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి బలాన్ని చేకూర్చే విధంగా జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఒక ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వయంగా వైసీపీకి చెందిన ఒక యువ నేత ఆ వీడియోలో మాట్లాడుతూ బీజేపీతో వైసీపీకి రహస్య ఒప్పందం కుదిరిందని చెప్పారు.
ఈ ఐదేళ్లలో జగన్ చాలా మారిపోయారని, అందుకు విజయసాయి రెడ్డి కారణమని సదరు వ్యక్తి వెల్లడించారు. జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు పరిస్థితి చెప్పడం కూడా కష్టమని, జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని ఆయన అన్నారు.