మంత్రి ఎర్రబెల్లితో కవిత సహా ఎమ్మెల్సీల భేటీ.. మంత్రికిచ్చిన వినతిపత్రంలో ఏముందంటే..

|

Feb 24, 2021 | 12:56 PM

తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు..

మంత్రి ఎర్రబెల్లితో కవిత సహా ఎమ్మెల్సీల భేటీ.. మంత్రికిచ్చిన వినతిపత్రంలో ఏముందంటే..
Follow us on

తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు మినిస్టర్‌ క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు టి భాను ప్రసాద్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వి భూపాల్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, బాలసాని లక్ష్మి నారాయణ, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్లా దామోదర్ రెడ్డి , తేరా చిన్నప రెడ్డి, పురాణం సతీష్ కుమార్ భేటీలో పాల్గొన్నారు.

Read more:

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు