దోచుకోడానికే నారాయణ రాజకీయాల్లోకి వచ్చాడు- అనిల్‌

నెల్లూరు : ఓటమి భయం మంత్రి నారాయణ కళ్లల్లోనే కనపడుతోందని, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్ధి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. మరో వారంలో జరగనున్న ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి తనను మరోసారి గెలిపించాలని ఆయన నెల్లూరు ప్రజలను  కోరారు. నగరంలోని పప్పులవీధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అనిల్‌ మాట్లాడారు. మంత్రిగా ఉన్న 58 నెలల్లో నారాయణ ఎప్పుడైనా కనిపించారా? అని ప్రశ్నించారు.  పదేళ్ల […]

దోచుకోడానికే నారాయణ రాజకీయాల్లోకి వచ్చాడు- అనిల్‌

Updated on: Apr 05, 2019 | 7:53 PM

నెల్లూరు : ఓటమి భయం మంత్రి నారాయణ కళ్లల్లోనే కనపడుతోందని, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్ధి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. మరో వారంలో జరగనున్న ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి తనను మరోసారి గెలిపించాలని ఆయన నెల్లూరు ప్రజలను  కోరారు. నగరంలోని పప్పులవీధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అనిల్‌ మాట్లాడారు. మంత్రిగా ఉన్న 58 నెలల్లో నారాయణ ఎప్పుడైనా కనిపించారా? అని ప్రశ్నించారు.  పదేళ్ల రాజకీయ జీవితం గడిపానని, తన భవిష్యత్తు నెల్లూరు ప్రజల చేతుల్లోనే ఉందని అనిల్ చెప్పారు. అవినీతి మచ్చ లేకుండా నిజాయతీగా సేవ చేశానని తెలిపారు.  రైల్వేలైన్‌ కోసం 700 ఇళ్లను తొలగిస్తామంటే కోర్టుకెళ్లి ప్రక్రియను నిలిపేయించిన విషయాన్ని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ప్రజలతోనే ఉంటున్నానని చెప్పారు. మంత్రి నారాయణ రూ.400 కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us