వైఎస్ వివేకానందరెడ్డి మృతిని రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో వివేకానందరెడ్డి, అవినాష్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. వివేకానందరెడ్డి ఎంపీ సీటు కావాలని కోరుతున్నట్లు సమాచారం ఉందన్నారు. వివేకానందరెడ్డి మృతిపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపించాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.