AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలి: బాల్క సుమన్

హైదరాబాద్: ఏపీ ఓటర్ల డేటా చోరీకి సంబంధించిన కేసుపై టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మాట్లాడుతూ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. అమరావతిలో పోలీసుల భద్రత మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్‌ను దాచి ఉంచారని ఆరోపించారు. బిన్ లాడెన్‌కు కూడా పాక్ అంత భద్రత ఇవ్వలేదని విమర్శించారు. డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్, ఐటీ మంత్రి నారా లోకేశ్ మంచి […]

మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలి: బాల్క సుమన్
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 10:21 AM

Share

హైదరాబాద్: ఏపీ ఓటర్ల డేటా చోరీకి సంబంధించిన కేసుపై టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మాట్లాడుతూ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. అమరావతిలో పోలీసుల భద్రత మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్‌ను దాచి ఉంచారని ఆరోపించారు. బిన్ లాడెన్‌కు కూడా పాక్ అంత భద్రత ఇవ్వలేదని విమర్శించారు. డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్, ఐటీ మంత్రి నారా లోకేశ్ మంచి ఫ్రెండ్స్ అని సుమన్ అన్నారు.

తమకు చంద్రబాబుపైనే కోపం కానీ ఏపీ ప్రజల మీద కాదన్నారు. ఆంధ్రా ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, ప్రాంతాలు విడిపోయినా ప్రజలు కలిసి ఉంటాం. మొదటి నుంచి చంద్రబాబుతో కేసీఆర్ చక్కగానే ఉన్నాసరే బాబే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారని బాల్క సుమన్ మండిపడ్డారు.