సబితమ్మకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

| Edited By:

Mar 13, 2019 | 8:47 PM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చేవెళ్లలో జరగబోయే భారీ బహిరంగ సభలో తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామ‌న్నారు. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కేటాయించేందుకు కేసీఆర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి భేటీ అయ్యారు. సుదర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం సబిత‌ కుమారుడు కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. తాము అడగాల్సినవి అడగ్గా.. ఆయన చెప్పాల్సినవి […]

సబితమ్మకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!
Follow us on

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చేవెళ్లలో జరగబోయే భారీ బహిరంగ సభలో తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామ‌న్నారు. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కేటాయించేందుకు కేసీఆర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి భేటీ అయ్యారు. సుదర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం సబిత‌ కుమారుడు కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. తాము అడగాల్సినవి అడగ్గా.. ఆయన చెప్పాల్సినవి చెప్పారని అన్నారు.